నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని,

నాగర్ కర్నూల్ లో తొక్కిసలాటలో చనిపోయిన రెండు నెలల పాప ఆత్మకు శాంతి కలగాలని, అగ్రవర్ణ అహంకారం తో రజక కుటుంబం పైన దాడి చేసినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం రజక సంఘం సభ్యులు డిమాండ్ చేసారు.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో 18వ తేది నాడు నాగర్ కర్నూల్ జిల్లాలో రజక కుటుంబం పై జరిగిన హేయమైన చర్యను నిరసిస్తూ. రెండు నెలల పాప, ముక్కుల పచ్చలారని పసికందును చంపడం.గుడిళ్ళోకి వంద రూపాయల రుసుము చెల్లించే దర్శనం చేసుకొని పోవాలని ఒక నియమంని పాటించాల్సిందని రజక కులాస్తురాలైన మూడు నెలల పాపను మరియు ఆ కుటుంబాన్ని విపరితమైన పదజాలంతో తిడుతూ వాళ్లపై చేయి చేసుకున్న సందర్భంలో ఆ యొక్క పాపను కూడా కొట్టి చంపడం జరిగింది. దాని నిరసిస్తూ ఈరోజు చందుర్తి మండల సంఘం ఆధ్వర్యంలో ఎవరైతే దోషులు ఉన్నారో ఆ రెడ్డిలకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఇటు పోలీస్ శాఖను అటు న్యాయ శాఖను మరియు హ్యూమన్ రైట్స్ ని ఈ రిక్వెస్ట్ చేస్తూ ఆ యొక్క దుండగులను వెంటనే శిక్షించి జైల్లో పెట్టాలని చందుర్తి మండలం రజక సంఘం కోరుకుంటుంది అలాగే ఈ హేయమైన చర్య ఇకపై జరిగితే క్షమించమని తెలియజేస్తూ.
మండల శాఖ అధ్యక్షులు సుద్దాల నరసయ్య ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు నరసయ్య సుద్దాల మరియు లింగంపల్లి వెంకటి మరియు శ్రీకాంత్ అలాగే గంగరాజు అలాగే మహేష్ శ్రీకాంత్ లింగంపల్లి రాము మరియు తదితరులు రజక సంఘ సభ్యులు ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version