నాగర్‌కర్నూల్‌లో జాతరలో కలకలం

నాగర్‌కర్నూల్‌లో జాతరలో కలకలం

 నెక్కొండ, నేటి ధాత్రి:

 

కుమ్మర మల్లన్న జాతర లొ దాడిని నిరసిస్తూ నెక్కొండలో బహుజన సంఘాలు నెక్కొండ సాకలి ఐలమ్మ సెంటర్ లో నిరసన దీక్ష చేపట్టారు.
నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెర గ్రామంలో జరిగిన కుమ్మర మల్లన్న జాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సందర్భంగా జాతరకు దైవదర్శనం కోసం వెళ్లిన చంద్రకళ కుటుంబంపై కొందరు దాడి చేసి దుర్భాషలాడినట్లు బాధితులు ఆరోపించారు.
బాధిత వర్గాల కథనం ప్రకారం, తాము ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, కుల దూషణలకు దిగారని తెలిపారు. అనంతరం జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసిందని, దాడిలో చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ ఘటనకు సంబంధించి కొందరు స్థానిక నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా పోలీసులు ధృవీకరణ ఇవ్వాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలంటూ బాధిత కుటుంబం మరియు బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఎంఆర్‌పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదునూరి యాకయ్య నెక్కొండ మండలంలో మాట్లాడుతూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మండల రజక సంఘం నాయకులు బొడ్డు పెళ్లి రాజ్ కుమార్, రామారావు రాము, అలాగే ఇతర కుల సంఘాల ప్రతినిధులు కూడా సంఘటనను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల దర్యాప్తు నివేదిక అనంతరం నిజానిజాలు వెలుగులోకి రానున్నాయని ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version