ఉమ్మడి వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్యర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు….

ఉమ్మడి వరంగల్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్యర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

 

మంగళవారం రోజున వరంగల్ ఉమ్మడి జిల్లా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా బి ఆర్ ఎస్ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది గుర్రాల వినోద్ కుమార్ నేతృత్వంలో హనుమకొండ లోని బి ఆర్ ఎస్ లీగల్ సెల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

బి ఆర్ ఎస్ న్యాయవాదులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్ లు పంపిణి చేశారు, ఈ సందర్బంగా “కెసిఆర్ లాంగ్ లైవ్ “అంటూ నినాదాలు చేస్తూ కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆ తరువాత జనార్దన్ గౌడ్, గణేష్ , రంజిత్ పత్రిక ముఖం గా గత అనుభవాలను నెమరు వేసుకున్నారు .

ఇట్టి కార్యక్రమం లో బి ఆర్ ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ గోకికర్ శివరాజ్ సీనియర్ న్యాయవాదులు, సహోదర్ రెడ్డి, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, వద్ది రాజ్ గణేష్, శ్యామ్ సుందర్ రావు, సోమేశ్వర్ రావు, చింతం సదానందం, ములుగూరి రంజిత్, నబి, వసంత్, వెంకటేశ్వర్ రావు బి, సిద్ధం యుగేందర్, వెంకట రమణ, శ్రీరాం కిరణ్, వేణుపటేల్, నాయిని రవి,శ్రీ రామ్,కొండయ్య, ఎలామాద్రి రవి,అనిల్ నాయక్, రమేష్, నాగరాజు తది తర న్యాయవాదులు పాల్గొన్నారు

ఘనంగా కెసిఆర్ 72 వ జన్మదిన వేడుకలు…

ఘనంగా కెసిఆర్ 72 వ జన్మదిన వేడుకలు

బిఆర్ఎస్ గణపురం మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సూరీడు,
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు,పండ్లను పంచి బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించారు
అనంతరం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి,దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో తెలంగాణ ను తన పాలన దక్షతతో మొదటి స్థానంలో నిలిపిన తెలంగాణ జాతిపిత కెసిఆర్ అని తెలిపారు.తెలంగాణ సంస్కృతి మాండలికంలో లోతుగా పాతుకుపోయిన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన తరచుగా కవితాత్మకమైన తెలుగు ప్రసంగాలకు ప్రసిద్ధి కెసిఆర్ అని అన్నారు..
.కెసిఆర్ తరచుగా ఆత్మగౌరవం,రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం మరియు పేదల అభివృద్ధి కోసం పాటుపడిన మహానేత అన్నారు.
. తన పది యేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమా కార్యక్రమాలను,అభివృద్ధికార్యక్రమలను జోడేద్దులాగా ముందుకు తీసుకెళ్లారు.
.కుల మతాల వివక్ష లేకుండా పాలించిన మహనీయుడు కెసిఆర్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమం లో మండలం బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు,ఉద్యమకారులు, నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, యూత్ నాయకులు కెసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version