ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు…

ఉద్యమకారులకు హైకోర్టు తీపి కబురు

తెలంగాణ ఉద్యమకారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు:

కేసముద్రం/ నేటి దాత్రి

 

తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 8 వారాల్లో ఇవ్వాలని హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశమై హైకోర్టు తీర్పు ఉద్యమకారులకు అనుకూలంగా ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ 8 వారాల్లో ఇవ్వాలని హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధివిధానాలు ప్రకటించి, సంబంధిత జి.వో. విడుదల చేయాలని, వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, అర్హత ఉన్న ఉద్యమకారులకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పిసిసి సభ్యులు గుగులోత్ దస్రూనాయక్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల ఉద్యమకారుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మాంకాల కట్టమల్లు, ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, భట్టు శ్రీనివాస్, శివారపు శ్రీధర్, గంధసిరి సోమన్న, వంగాల అశోక్, పింగిళి శ్రీనివాస్, జనిగల కొమురెల్లి, బాలు మోహన్, వేం నరసింహారెడ్డి, సోమారపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, చుంచు సూరయ్య, కీర్తి సమ్మయ్య, మాందాటి ఆంజనేయులు, గాండ్ల మలేంద్రం పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version