రాష్ట్రస్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు

రాష్ట్రస్థాయి నుంచి సౌత్ ఇండియా స్థాయికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న కాపిల్ల నరేష్ ప్రాథమిక స్థాయిలో పిల్లలకు బోధించేందుకు తయారుచేసిన *బోధన అభ్యసన సామాగ్రి* రాష్ట్రస్థాయి నుండి సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎంపికైన ఏకైక టీచర్ నరేష్ ఈనెల 7,8,9 తేదీలలో రాష్ట్రస్థాయిలో కామారెడ్డి లో జరిగిన *రాజ్యస్థరీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025-26* లో భాగంగా *టీచర్ ఎగ్జిబిట్* విభాగంలో తను తయారుచేసిన బోధనాభ్యాసన సామాగ్రిని ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వచ్చిన ప్రదర్శనల అన్నిటి నుండి టాప్ లో నిలిచి ఈనెల 19 నుండి 23 వరకు సౌత్ రాష్ట్రాలు పాల్గొనే సౌత్ ఇండియా స్థాయికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగింది.

 

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కాపిల్ల నరేష్ మాట్లాడుతూ *నేను పిల్లలకు బోధించే సమయంలో ఉపయోగించే సామాగ్రిని ప్లాస్టిక్ వినియోగం లేకుండా కేవలం అటముక్కలు, పేపర్ లాంటి వాటితో ఎలాంటి ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో పిల్లలు స్వయంగా ఉపయోగించుకుంటూ గణితం, తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా తయారు చేయడం వల్ల ఇది చాలామందికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతో రాష్ట్రస్థాయి న్యాయ నిర్నేతలు నా బోధన అభ్యసన సామాగ్రిని సౌత్ ఇండియా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.*

ఈ సందర్భంగా సౌత్ ఇండియా స్థాయికి ఎంపికైన కాపీల నరేష్ ను మండల విద్యాధికారి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అభినందించారు.

*మొగుడంపల్లి మండలంలోనీ పాఠశాలల ఆకస్మికజిల్లా అధికారుల తనిఖీ.*

*మొగుడంపల్లి మండలంలోనీ పాఠశాలల ఆకస్మికజిల్లా అధికారుల తనిఖీ.*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రాథమిక పాఠశాల ఖాoజమల్ పూర్ మరియు గోడిగ్యార్ పల్లి పాఠశాలలో ఈ రోజు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, జిల్లా టీం మెంబర్స్ యం,డి వాహబోదీన్, నిమ్మల కిష్టయ్య, పాఠశాలలకు అకస్మాత్తుగా వెళ్లి రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఎఫ్, ఎల్, ఎన్. సి. సి. ఇ. పేరెంట్స్ మీటింగ్, మధ్యాహ్న భోజనo, టాయిలెట్స్, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి నమోదు రికార్డులను, తరగతి ఉపాధ్యాయుల పరిశీలన, తరగతి టీ,ఎల్,యం లకు సంబంధించిన
రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
వివిధ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగులో కొంతమంది విద్యార్థులు ధారాళంగా చదవడం, గణితం లో చతుర్విధ ప్రక్రియలు చేయడంలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు సంతృప్తి వ్యక్తపరిచారు.
వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, తరగతి గదిలో టీ,ఎల్,ఎమ్ ప్రదర్శించి, హ్యాండ్ బుక్ ను ఉపయోగించి బోధించాలని, తాగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version