భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్….

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..

 

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ నిర్దేశించిన 176 పరుaమదాస స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది (India vs Pakistan T20 World Cup).
ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. గ్యాలరీ నుంచి చాలా సేపు మ్యాచ్ వీక్షించారు. అయితే ఛేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది నఖ్వీ అనే సంగతి తెలిసిందే (Mohsin Naqvi stadium exit).

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం….

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్

 

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు చేశాడు (Akhtar on Pakistan loss).
‘మేము మ్యాచ్‌లో ఏ దశలోనూ పోటీలో లేము. షాహీన్ 125 కి.మీ./గం. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంత వేగం ఆధునిక క్రికెట్‌కు అవసరం లేదు. వీరు ఒత్తిడిని తట్టుకునే ప్రతిభావంతులు కాదు. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఏ దశలోనూ భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేము. గత 15-20 సంవత్సరాలుగా క్రికెట్‌పై మేం నిజాయితీగా పెట్టుబడి పెట్టలేదు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించలేదు’ అని అక్తర్ పేర్కొన్నాడు 

ఆటలు సాగేది ఇక్కడే..

ఆటలు సాగేది ఇక్కడే!

 

వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు.

వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక దేశాల్లోని ఏడు నగరాలు, 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంటే శ్రీలంకలోని కొలంబోలో రెండు మైదానాలను వేదికలుగా ఎంపికచేశారు. అవి నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్‌), వాంఖడే స్టేడియం (ముంబై), అరుణ్‌ జైట్లీ స్టేడియం (న్యూఢిల్లీ), ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై), ఈడెన్‌ గార్డెన్స్‌ (కోల్‌కతా), ప్రేమదాస స్టేడియం, సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (కొలంబో), పల్లెకెలె స్టేడియం (క్యాండీ).

అద్భుతంగా నిర్మించిన ఈ వేదికలో ఫైనల్‌ (పాక్‌ ఫైనల్‌కు రాకుంటే) సహా ఏడు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 11 అంతర్జాతీయ టీ20లు నిర్వహించారు.. వీటిలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు ఏడు మ్యాచ్‌లు, మొదట బౌలింగ్‌ చేసిన జట్లు నాలుగు మ్యాచ్‌లు నెగ్గాయి. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు.

స్కాట్లాండ్‌కు కలిసొచ్చింది..

స్కాట్లాండ్‌కు కలిసొచ్చింది..

 

వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్‌.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ మెగా టోర్నీని బాయ్‌కాట్‌ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.

 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన స్కాట్లాండ్‌.. అదృష్టం కలసి రావడంతో ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్‌ మెగా టోర్నీని బాయ్‌కాట్‌ చేయడంతో ఐసీసీ ర్యాకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది. దీంతో ఏడోసారి వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం చేజిక్కించుకొంది. 2007, 2009, 2016, 2021, 2022, 2024ల్లో స్కాట్లాండ్‌ పొట్టికప్‌లో పాల్గొంది. అత్యుత్తమంగా 2021లో సూపర్‌-12కు చేరింది. 2024లో నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో త్రుటిలో సూపర్‌-8కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. అయితే, ఈసారి యూరోపియన్‌ రీజినల్‌ క్వాలిఫయర్స్‌లో ఇటలీ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిన స్కాట్లాండ్‌ నాలుగో స్థానంతో సంతృప్తి చెందింది. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇటలీ, నెదర్లాండ్స్‌ పొట్టికప్‌ బెర్త్‌లు పట్టేశాయి. కానీ, బంగ్లాదేశ్‌ జట్టు వైదొలగడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు జాక్‌పాట్‌ తగిలింది.
పెద్ద జట్లకు పారాహుషార్‌..

గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఇటలీ, నేపాల్‌తో స్కాట్లాండ్‌ ఆడనుంది. తమకంటే బలమైన జట్లకు షాకిచ్చిన చరిత్ర స్కాట్లాండ్‌ సొంతం. 2021లో బంగ్లాదేశ్‌, 2022లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఇక, 2024లో ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఈసారి అనూహ్యంగా చాన్స్‌ పట్టేసిన స్కాట్లాండ్‌ ఎవరికి ఝలక్‌ ఇస్తుందో చూడాలి. గ్రూప్‌లో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌లలో ఒక్కరికి షాకిచ్చినా చాలు.. స్కాట్లాండ్‌ సూపర్‌-8 అవకాశాలు బలపడతాయి.

అనుభవజ్ఞుడైన కెప్టెన్‌..

ఆల్‌రౌండర్‌ రిచీ బెరింగ్టన్‌ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టును స్కాట్లాండ్‌ ప్రకటించింది. వీరిలో 11 మంది గత టోర్నీలో ఆడిన వారే కావడం విశేషం. కెప్టెన్‌ బెరింగ్టన్‌ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. 2007లో అరంగేట్రం నుంచి అతడు 300 మ్యాచ్‌ల్లో 8 వేల పరుగులు సాధించాడు. 100 వికెట్లు పడగొట్టాడు. ఇక వికెట్‌ కీపర్‌/బ్యాటర్‌ అయిన మాథ్యూ క్రాస్‌ మరో ప్రధాన ఆటగాడు. బ్రాడ్లీ క్యూరీ పేస్‌ విభాగానికి నాయకత్వం వహించనుండగా.. యువ పేసర్‌ జైనుల్లా ఇహ్సాన్‌ తొలిసారి జట్టులోకి వచ్చాడు.

ఎంత ప్రైజ్‌మనీ రావచ్చు?

టోర్నీలో ఆడినందుకు ఆయా బోర్డులకు ఐసీసీ రూ. 2.75 కోట్ల నుంచి 4.60 కోట్ల వరకు చెల్లిస్తుంది. అంతేకాకుండా ప్రపంచకప్‌లో నెగ్గిన ప్రతీ మ్యాచ్‌కు చెల్లించే రూ.30 లక్షలు అదనం.

సూపర్‌-8కు చేరుకోలేకపోయినా..

నేపాల్‌, ఇటలీపై స్కాట్లాండ్‌ నెగ్గే చాన్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్‌ దాదాపు రూ. 5.50 కోట్ల వరకు ప్రైజ్‌మనీని పొందే అవకాశాలున్నాయి.

ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్ల సందడి…

https://youtu.be/7A89nHr7dqQ?si=8cjYcgq-Z7m4SyQk
ఈ ప్రపంచకప్‌లో టైటిల్‌ వేటకు ఏకంగా 20 దేశాలు సమరశంఖం పూరించాయి. ఇవి నాలుగు గ్రూపులుగా విడిపోయి అమీతుమీకి సై అంటున్నాయి. ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ కచ్చితంగా హాట్‌ ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కప్‌ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే, ఇంత పట్టుదలతో తలపడుతున్న టీమిండియాకు ప్రత్యర్థులుగా మనోళ్లే బరిలోకి దిగుతుండడం ఇక్కడ విశేషం. అదెలాగంటే.. భారత మూలాలున్న 30 మందికిపైగా ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ఈ టీ20 ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా టోర్నీలో ఏదో ఒక దశలో భారత జట్టుతో ప్రత్యర్థిగా తలపడనున్నారన్నమాట. ఈ ఆటగాళ్లలో కొందరు భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడిన వాళ్లు కూడా ఉండడం గమనార్హం. ఇంతమంది భారత సంతతి ఆటగాళ్లు మెగా టోర్నీలో పోటీపడుతుండడం ఇదే తొలిసారి.
ఇటీవలి కాలంలో ఇతర దేశాల జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లలో ఎప్పటినుంచో భారతీయ ప్రాతినిథ్యం ఉంటున్నా.. దక్షిణాఫ్రికా జట్టులో సైతం ఇటీవల భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న భారత సంతతి ఆటగాళ్లలో స్టార్‌ ఎట్రాక్షన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రను చెప్పుకోవచ్చు. కివీస్‌ జట్టులో ప్రధాన సభ్యుడిగా ఉన్న రచిన్‌ పూర్వీకులది చెన్నై. కివీస్‌ జట్టులోనే ఇష్‌ సోధి కూడా భారతీయ మూలాలున్న క్రికెటర్‌. మరో బలమైన జట్టు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌, నెదర్లాండ్స్‌ జట్టులోని ఆర్యన్‌ దత్‌ కూడా భారత సంతతి వారే.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version