ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్ల సందడి…

https://youtu.be/7A89nHr7dqQ?si=8cjYcgq-Z7m4SyQk
ఈ ప్రపంచకప్‌లో టైటిల్‌ వేటకు ఏకంగా 20 దేశాలు సమరశంఖం పూరించాయి. ఇవి నాలుగు గ్రూపులుగా విడిపోయి అమీతుమీకి సై అంటున్నాయి. ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ కచ్చితంగా హాట్‌ ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కప్‌ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే, ఇంత పట్టుదలతో తలపడుతున్న టీమిండియాకు ప్రత్యర్థులుగా మనోళ్లే బరిలోకి దిగుతుండడం ఇక్కడ విశేషం. అదెలాగంటే.. భారత మూలాలున్న 30 మందికిపైగా ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ఈ టీ20 ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా టోర్నీలో ఏదో ఒక దశలో భారత జట్టుతో ప్రత్యర్థిగా తలపడనున్నారన్నమాట. ఈ ఆటగాళ్లలో కొందరు భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడిన వాళ్లు కూడా ఉండడం గమనార్హం. ఇంతమంది భారత సంతతి ఆటగాళ్లు మెగా టోర్నీలో పోటీపడుతుండడం ఇదే తొలిసారి.
ఇటీవలి కాలంలో ఇతర దేశాల జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లలో ఎప్పటినుంచో భారతీయ ప్రాతినిథ్యం ఉంటున్నా.. దక్షిణాఫ్రికా జట్టులో సైతం ఇటీవల భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న భారత సంతతి ఆటగాళ్లలో స్టార్‌ ఎట్రాక్షన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రను చెప్పుకోవచ్చు. కివీస్‌ జట్టులో ప్రధాన సభ్యుడిగా ఉన్న రచిన్‌ పూర్వీకులది చెన్నై. కివీస్‌ జట్టులోనే ఇష్‌ సోధి కూడా భారతీయ మూలాలున్న క్రికెటర్‌. మరో బలమైన జట్టు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌, నెదర్లాండ్స్‌ జట్టులోని ఆర్యన్‌ దత్‌ కూడా భారత సంతతి వారే.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version