జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్ల…

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్ల

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 16 మంది స్కౌట్స్ మరియు 16 మంది గైడ్స్ దీక్ష స్వీకారం చేశారు. పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా వారికి స్కౌట్స్ అండ్ గైడ్స్ దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.

స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ, ప్రకృతి మరియు జంతువుల పట్ల దయాగుణం, వృద్ధుల పట్ల సేవాభావం వంటి మంచి విలువలను పెంపొందించడం.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారదా మేడం, అనురాధ మేడం, తిరుపతి సార్, గైడ్ టీచర్ కొండికొప్పుల మంజుల గారు, స్కౌట్ మాస్టర్ తడుకల సురేష్, మరియు ఇతర ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…

ప్రాథమిక పాఠశాల ఝాన్సీ లింగాపూర్ బీసీకాలనీ లో స్వయం పరిపాలన దినోత్సవం…

రామాయంపేట మార్చి 9 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ బీసీ పాఠశాలలో సోమవారం నాడు స్వయంపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు సహార్శ్ డి ఈ ఓ గా నందీశ్వర్ ఎంఈఓ గా మనీష్ గౌడ్ హెడమాస్టర్ గా యశ్వంత్ పి ఈ టి గా రామకృష్ణ శివప్రసాద్ శివతేజలు ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులుగా నందిత తేజస్విని అవంతిక రిషిక మరియు శ్రీనిధి విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నరసింహారావు ఉపాధ్యాయులు రవికుమార్ పాల్గొని ఉపాధ్యాయులైన విద్యార్థులను అభినందించి బహుమతులు ఇవ్వడం జరిగింది.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించి మండల విద్యాధికారిగా, ప్రధానోపాధ్యాయులుగా,ఉపాధ్యాయులుగా మరియు ఇతర బాధ్యతలను చేపట్టి ఒకరోజు పాటు పాఠశాల కార్యకలాపాలను నిర్వహించారు. డి ఈ ఓ గా బానోతు సూర్య తేజ, ఎం ఈ ఓ గా గట్ల మనీషా,ప్రధానోపాధ్యాయులుగా గుండెబోయిన సుస్మిత, ఉపాధ్యాయులుగా లకావత్ ఇందు, గుండెల బిందు, బట్టి దివ్య, భూక్య ధీరజ్, నిమ్మల శ్రీ వేణి, మహమ్మద్ రెహనా, మహమ్మద్ రియాజ్, లకావత్ చరణ్, అటెండర్ గా కోడి రాకేష్ విధులు నిర్వర్తించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తరగతులు బోధించడం, అసెంబ్లీ నిర్వహించడం మరియు పాఠశాల వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్నా హరినాధ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులందరికీ చికెన్ కూరతో మధ్యాహ్న భోజనం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుండు సురేందర్, వీసం నర్సయ్య, వెలమాల భాస్కర్ భాస్కర్, , అప్పాల నాగరాజు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేశారు.

విద్యార్థి స్వయం పాలన: పాఠశాలలో ఒక వినూత్న కార్యక్రమం..

విద్యార్థి స్వయం పాలన: పాఠశాలలో ఒక వినూత్న కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం శంషల్లాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో, విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు అధికారుల పాత్రలను పోషించడం ద్వారా పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు.ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి ఉపాధ్యాయులు కవిత నందినిల పర్యవేక్షణలో విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఆసక్తికరంగా పాఠాలు బోధించారు.విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version