ఉస్తాద్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది..

ఉస్తాద్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది..

రాశీఖన్నా మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది.

రాశీఖన్నా (Rashi khanna) మల్టీ టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌. వైవిధ్యమైన పాత్రలతో నటిగా నిరూపించుకున్నారు. పాటలు పాడే టాలెంటూ ఆమెలో ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ భామ అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్నారు. 12 ఏళ్లుగా టాలీవుడ్‌లో సక్సెస్‌ ఫుల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. పక్కా కమర్షియల్‌, థ్యాంక్యూ చిత్రాల తర్వాత తెలుగులో మరో సినిమా అవకాశం అందుకోలేదు. కొంతగ్యాప్‌ తర్వాత ఓ పెద్ద అవకాశం అందుకున్నారు. రాశీఖన్నా. అది కూడా పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సరసన. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లో (Ustaad Bhagat Singh) రాశీ అవకాశాన్ని సొంతం చేసుకొంది. హరీశ్‌శంకర్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీలీల ఓ కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే!

పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి

* పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి.*

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామ శివారులో గురువారము సాయంత్రం 3:30 పిడుగుపాటుకు 23 మేకలు మృత్యువాత పడ్డాయి. కుప్పా నగర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప.తనకున్న మేకలను మేత కోసం గ్రామ పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.ఒక్కసారిగా పిడుగుపడడంతో.మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు… పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పిచ్చకుంట్ల బాలప్ప తండ్రి లక్ష్మప్ప కు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు.
మేకలు మృతి చెందిన వార్త విన్న వెంటనే కుప్పా నగర్ గ్రామ సెక్రెటరీ స్వప్న ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు ఝరాసంగం మండల ఎంఆర్ఓ తిరుపతి రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు ఝరాసంగం సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ రైతులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version