ఎండ తీవ్రత నుంచి రక్షణ జాగ్రత్తలు పాటించాలి…

ఎండ తీవ్రత నుంచి రక్షణ జాగ్రత్తలు పాటించాలి

నర్సంపేట సీఐ శ్రీనివాస్ సిబ్బందికి సూచనలు

పోలీస్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లు, క్యాప్స్,టవల్స్ పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

విధి నిర్వహణలో వేసవికాలంలో ఎండ తీవ్రతకు జాగ్రత్త తీసుకోవాలని నర్సంపేట టౌన్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందికి సూచించారు.నర్సంపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేసవిలో బయట పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి చలువ కళ్లజోళ్లు, క్యాప్స్, టవల్‌లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ చేసే సమయంలో ఎండ తీవ్రత వల్ల అస్వస్థతకు గురికాకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు గూడా అరుణ్ కుమార్, రవికుమార్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version