వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం…

వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం…

◆-: శివనామస్మరణతో మారుమోగిన కేతకి ఆలయం

◆-: కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలు.

◆-: పట్టువస్త్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంఘం,అష్ట తీర్థముల సంఘ మం.. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి నవహీనిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళ వారం నాడు శ్రీ కేతకి ఆలయంలో పార్వ తీ పరమేశ్వరుల కళ్యాణం మహోత్స వం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జహీ రాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షే ట్కార్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్టావు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు ఆలయ ప్రాంగాణంలో చూడముచ్చట గా అలంకరించిన పచ్చని తోరణాలు, పూ ల పందిళ్ళతో, పార్వతీ పరమేశ్వరుల క ళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ పురోహితులు, పేద బ్రాహ్మణుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యా లు, అశేష భక్త జనాలు

తిలకిస్తుండగా అమ్మవారి మాంగళ్య సూత్రధారి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అర్చకు లు, వేద బ్రాహ్మణుల మంత్రోచరణా లతో కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో గణపతి పూ జతో పాటు, దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలతో కేతకీ ఆలయం భక్తులతో ఓం నమశివాయ నామస్మరణతో మారుమో గింది. ఈ కళ్యాణ మహోత్సవానికి అశేష భక్తజనంతో పాటు, పలు రాష్ట్రాలకు చెం దిన భక్తులతో పాటు, వివిధ గ్రామాల ప్ర జా ప్రతినిధులు, ప్రజలు, మహిళామణు లు, కళ్యాణోత్సవం తిలకించేందుకు హాజరయ్యారు. ఆలయ అర్చకులతో పాటు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చణాల మధ్య కళ్యాణ మహోత్సవ ముహూర్త ఘడియలు సమీపిస్తున్న కొద్ది పార్వతీ పరమేశ్వరులకళ్యాణం చూదం రారండి అనే భావనతో భక్తుల ఎదురుచూస్తు ండగా 7 గంటలకు కళ్యాణ మహోత్సవా న్ని అర్చకులు, వేద బ్రాహ్మణులు, ముగించారు. స్వామి వారి కళ్యాణ మహోత్స వంలో అధిక మొత్తంలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు కళ్యా ణ ప్రాప్తిరస్తూ అంటూ వారు పార్వతీ పరమేశ్వరులకు తీసుకొచ్చిన ముత్యాలు తలంబ్రాలను వేసి కళ్యాణ వైభోగం కనులారా చూసి ఆనందించారు. కళ్యాణ మహోత్సవానికి హాజరైన వారందరికీ స్వామి వారి ఆశీస్సులతో పాటు కుకుమ తో పాటు తీర్థప్రసాదాలు ఆలయ అర్చకు లు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పటేల్ కేతకి ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, ఝరాసంఘం గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్, గ్రామ ఉపసర్పంచ్ గడ్డం మమతా అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల, మాజీ ఎంపిటిసి ఎంపీ రజిని ప్రియ సంతోష్ పాటిల్, మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ ఏజాద్ బాబా నాగన్న పటేల్ సిను పటేల్ సజ్జన్ నాగేశ్వర్ మల్లన్న పటేల్ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా కేతకీలో రథోత్సవం…

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా
ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 12:00 గంటలకు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం నుండి రథోత్సవం వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకు వచ్చారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి రథంపై అధిష్టించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంగళవాయిద్యాలు, ఢమరుక నాదాలతో అశేష జనవాహిని మధ్య రథోత్సవం నయనానందకరంగా సాగింది. రాత్రి 3 గంటల వరకు రథం ఊరేగింపు కొనసాగింది. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ స్వయం పర్యవేక్షణలో ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ భారీ బందోబస్తు మధ్య ఉత్సవాలు ముగిశాయి.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు…

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు

జగన్మాత కు 11 రోజులకు పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వాదం అందుకున్న సమ్మి గౌడ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు సత్తయ్య గౌడ్,గంగోత్రి సంఘం అధ్యక్షురాలు తీగల సునీత,మహిళా సోదరిమనులతో, కమిటీ సభ్యుల తో కలిసి దేవి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు గౌడ్..విగ్రహ దాతగా ముందుండి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రతీ రోజు అమ్మవారి అలంకరణలో భాగంగా పదకొండు రోజులకు 11 పట్టు వస్త్రాలు బహుకరించారు..ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆ దుర్గామాతతల్లి ప్రత్యేక పూజలలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించే చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఆ జగన్మాతకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఆ తల్లి తాళ్ల పూస పల్లి గ్రామ ప్రజలను, యువతను ప్రతి ఒక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి సంపదలతో సంపన్నులు అయ్యే విధంగా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మాకు విగ్రహ దాతగా నిలిచి దుర్గామాతకు పట్టు వస్త్రాలు బహుకరించి మా ఆహ్వానం మేరకు పూజల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆ జగన్మాత ఆశీస్సులు సమ్మయ్య గౌడ్ కి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని వారి ఆశయాలు ఆ తల్లి నెరవేర్చాలా ప్రజలందరికీ అండగా ఉండడమే కాకుండా తనను ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్ గౌడ్,రాజు,హరీష్, రాజేష్,విజయ్, మధుకర్,సంతోష్, రాజేష్,నరేందర్,సురేష్, అనుదీప్,సురేష్, ప్రభాకర్,రమేష్,సాయి, హరీష్, బాలరాజు సత్యప్రసాద్, మహేష్,యాకన్న,వల్లాల రాజేందర్ గౌడ్,వంగ సురేందర్ గౌడ్,వల్లాల శ్రావణ్ గౌడ్,తీగల మనోజ్ గౌడ్,మెంచు వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version