దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు…

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు

జగన్మాత కు 11 రోజులకు పట్టు వస్త్రాలు బహుకరించి ఆశీర్వాదం అందుకున్న సమ్మి గౌడ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామం లో అన్నదాత యూత్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు సత్తయ్య గౌడ్,గంగోత్రి సంఘం అధ్యక్షురాలు తీగల సునీత,మహిళా సోదరిమనులతో, కమిటీ సభ్యుల తో కలిసి దేవి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిలువేరు గౌడ్..విగ్రహ దాతగా ముందుండి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని ప్రతీ రోజు అమ్మవారి అలంకరణలో భాగంగా పదకొండు రోజులకు 11 పట్టు వస్త్రాలు బహుకరించారు..ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆ దుర్గామాతతల్లి ప్రత్యేక పూజలలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించే చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఆ జగన్మాతకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఆ తల్లి తాళ్ల పూస పల్లి గ్రామ ప్రజలను, యువతను ప్రతి ఒక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి సంపదలతో సంపన్నులు అయ్యే విధంగా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మాకు విగ్రహ దాతగా నిలిచి దుర్గామాతకు పట్టు వస్త్రాలు బహుకరించి మా ఆహ్వానం మేరకు పూజల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆ జగన్మాత ఆశీస్సులు సమ్మయ్య గౌడ్ కి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని వారి ఆశయాలు ఆ తల్లి నెరవేర్చాలా ప్రజలందరికీ అండగా ఉండడమే కాకుండా తనను ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్ గౌడ్,రాజు,హరీష్, రాజేష్,విజయ్, మధుకర్,సంతోష్, రాజేష్,నరేందర్,సురేష్, అనుదీప్,సురేష్, ప్రభాకర్,రమేష్,సాయి, హరీష్, బాలరాజు సత్యప్రసాద్, మహేష్,యాకన్న,వల్లాల రాజేందర్ గౌడ్,వంగ సురేందర్ గౌడ్,వల్లాల శ్రావణ్ గౌడ్,తీగల మనోజ్ గౌడ్,మెంచు వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version