అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు..

అనుచితంగా ప్రవర్తించి.. హతమయ్యాడు

 

 

తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది.

ధర్మవరం(అనంతపురం): తన భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకే మెకానిక్‌ ధనుంజయ(Dhananjaya)ను వరుసకు సోదరుడైన శివయ్య హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్‌లో ఈ నెల 21వ తేదీ రాత్రి జరిగిన మెకానిక్‌ పాళ్యం ధనుంజయ హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడు శివయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ హేమంత్‌కుమార్‌ తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు తెలిపారు.

 

 

కేతిరెడ్డి కాలనీ ఎల్‌-2లో పాళ్యం శివయ్య, ఎల్‌-3లో అతని పిన్ని కుమారుడు పాళ్యం ధనుంజయ నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ స్నేహంగా ఉంటూ మద్యం సేవించేవారు. శివయ్య భార్యతో ధనుంజయ చెడుగా ప్రవర్తించేవాడు. దీంతో శివయ్య(Shivayya) మందలించాడు. అయినా అతనిలో మార్పురాలేదు.

దీంతో శివయ్య కక్ష పెంచుకుని పథకం ప్రకారం ఈ నెల 21వతేదీ అర్ధరాత్రి ఎల్‌పీ సర్కిల్‌లో బ్రిడ్జి కింద ధనుంజయను సిమెంట్‌ ఇటుకతో బాది చంపేశాడు. నిందితుడిని సీఐ నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ కేతన్న, హెడ్‌ కానిస్టేబుళ్లు అప్పస్వామి, శివశంకర్‌, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్‌, బయన్న, సుధీర్‌కుమార్‌, రాజన్న శనివారం అరెస్టు చేశారని డీఎస్పీ తెలిపారు.

శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు

శివయ్యా ట్రోలింగ్.. స్పందించిన మంచు విష్ణు

 

Manchu Vishnu: నేటిధాత్రి

 

 

 


 

మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే.

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోస్ ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Maohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar)  స్పెషల్ క్యామియోస్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే కన్నప్ప సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,  టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు.. తన సినిమాలోని శివయ్యా అనే డైలాగ్ మీద జరిగిన ట్రోలింగ్ పై స్పందించాడు. కన్నప్ప  టీజర్  చివర్లో మంచు విష్ణు శివయ్యా అని అరుస్తున్న డైలాగ్ ఉంటుంది. టీజర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఆ డైలాగ్ ఒక మీమ్ లా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ అన్నింటిని కలిపి  శ్రీవిష్ణు(Srivishnu) హీరోగా నటించిన సింగిల్(Single) సినిమాలో పెట్టారు. ట్రైలర్ కట్ లో  శివయ్యా డైలాగ్ ను కూడా రీక్రియేట్ చేశారు. 

 

 సింగిల్ ట్రైలర్ రిలీజ్ తరువాత శివయ్యా డైలాగ్ ను ట్రోల్ చేసినందుకు మంచు విష్ణు సీరియస్ అయ్యాడు.  ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి లేఖ రాసి.. ఆ డైలాగ్ ను తీయించేసాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ ట్రోలింగ్ పై మంచు విష్ణు మాట్లాడాడు. సింగిల్ సినిమాలో  శివయ్యా డైలాగ్ ను అల్లు అరవింద్ ఎందుకు తీయించేశాడు.. మీరేమైనా చేశారా.. ? అన్న ప్రశ్నకు మంచు విష్ణు మాట్లాడుతూ.. ” నేను ప్రొడ్యూసర్  కౌన్సిల్ కి ఒక లెటర్ రాశాను. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు .. లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనమందరం ఒకటి అవ్వాలి. మనమందరం ఒకటిగా ఉండాలి.

 

 ఆ సినిమాలో ఒకటి నందమూరి బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. అదే టైమ్ లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది.  ఒక్కరు కూడా ఆయనకు కంగ్రాట్స్  మెసేజ్ పెట్టలేదు కానీ, ఆయన కామెడీ అయితే చేశారు. కన్నప్ప సినిమాది చేశారు. ఇండస్ట్రీలో ఇది కొత్త ట్రెండా.. ? మీరు అడ్రెస్స్ చేస్తారా.. ? లేక రేపు నా సినిమాలో మిగితావాళ్లను పెట్టినప్పుడు ఎవరైనా అడిగితే మాత్రం బావుండదు. ఇది  ఇప్పుడు నార్మల్ గా ఉందా.. ? అలా అయితే నేను కూడా అంగీకరిస్తాను. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది అని చెప్తే నేను కూడా నేర్చుకుంటాను అని చెప్పాను. వారు అరవింద్ గారితో మాట్లాడారు. అసలు ఎందుకు ఈ డైలాగ్ అందులో పెట్టారు.. ? ఆ తరువాత ఎందుకు తీసేశారు అనేది ఆయననే అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు.  

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version