తన అభిమాన నాయకుడి పుట్టినరోజులు.. రక్తదానం
బాలానగర్ /నేటి ధాత్రి
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలానగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సభావత్ రమేష్ నాయక్ లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలన్నారు. తన అభిమాన నాయకుడి పుట్టినరోజున ఒక ప్రాణాన్ని కాపాడే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పార్టీ శ్రేణులు ఆయనను అభినందించాయి.
