నాయకుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం

తన అభిమాన నాయకుడి పుట్టినరోజులు.. రక్తదానం

బాలానగర్ /నేటి ధాత్రి

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా మంగళవారం జడ్చర్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలానగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సభావత్ రమేష్ నాయక్ లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలన్నారు. తన అభిమాన నాయకుడి పుట్టినరోజున ఒక ప్రాణాన్ని కాపాడే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పార్టీ శ్రేణులు ఆయనను అభినందించాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version