ఝరాసంగం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పట్లోళ్ల రవి కుమార్…

ఝరాసంగం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా పట్లోళ్ల రవి కుమార్

●-: సర్పంచుల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తనపై నమ్మకం ఉంచి ఝారసంగం మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచులకు దేవరం పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రవి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాడు ఝారసంగం మండలం సర్పంచుల.ఫోరం అధ్యక్షుడి ఎంపిక కోసం సర్పంచులు సమావేశమై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఆధ్వర్యంలో మండల నూతన సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా దేవరపల్లి సర్పంచ్ పట్లోల రవి కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే విదంగా ఉపాధ్యక్షురాలు గినియార్పల్లీ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం సర్పంచులతో కలిసి ముందుకు వెళ్తామని, తమ మధ్య ఎలాంటి పట్టింపులు లేవని, సర్పంచుల సమస్యల పరిష్కరం కోసం మంత్రి దామోదర్ రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ల సహకారంతో అభివృద్ధి పనులు చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో లో వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు యువ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version