ఘనంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సభలు…

ఘనంగా సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ సభలు

గుండాల,నేటిధాత్రి :

సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలో గుండాల,కాచనపల్లి జగ్గుతండ,కొడవటంచ, ముత్తాపురం, మోదుగులగూడెం, నడిమిగూడెం,తూరుబాక, చెట్టుపల్లి,రేగులగూడెం గ్రామాలలో జెండాలు ఎగరవేసి సభలు, సమావేశాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, పూణెం రంగయ్య, బచ్చల సారయ్యలు మాట్లాడుతూ సిపిఐ ,సిపిఎం రిజనిజం, వ్యతిరేకిస్తూ 1969 ఏప్రిల్22 తేదీన లెనిన్ జయంతి సందర్భంగా సిపిఐ ఎంఎల్ పార్టీఆవిర్భవించి పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించింది,
ముఖ్యంగా గోదావరి లోయ పరివాహక ప్రాంతాల్లో దున్నేవానికి భూమి కావాలని నినాదంతో లక్షలాది ఎకరాలు పోడు భూములను కొట్టించి వాటి పట్టాల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాల మెడలు వంచి పట్టాలు సాధించింది అన్నారు.
ఈ పోరాటాలలో భాగంగా బాటన్న, కొండన్న , లింగన్న, మురళి, కాచనపల్లి అమరులు, కోటన్న,నంబూరి సీతారామారావు, నోముల పరశురాములు,సుశేన,చింత లక్ష్మి అనేకమంది తమ విలువైన ప్రాణాలను ప్రజల కోసం రక్తర్పణ చేశారని అన్నారు.వీరి ఆశయ సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు తిప్పికొట్టేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా, మండల నాయకులు అరేం నరేష్,పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పెంటన్న,ఇసం కృష్ణన్న,ఈసం మంగన్న, పాయం ఎల్లన్న,మణాల ఉపేందర్,తాటి రమేష్,గోగ్గల శ్రీను,భూఖ్య వెంకన్న, ఈసం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version