జహీరాబాద్ శివారులో లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు…

జహీరాబాద్ శివారులో లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నం-పూణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు ఉల్లిగడ్డ లోడ్ తో వెళుతున్న లారీ టైర్ పేలి డివైడర్ ను ఢీ కొనగా వెనుక నుంచి వస్తున్న డీసీఎం లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సహదీప్ మండల్ (30), బాలాజీ (50) అనే ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు…

జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుచ్చినెల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version