జహీరాబాద్ శివారులో లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు…

జహీరాబాద్ శివారులో లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నం-పూణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు ఉల్లిగడ్డ లోడ్ తో వెళుతున్న లారీ టైర్ పేలి డివైడర్ ను ఢీ కొనగా వెనుక నుంచి వస్తున్న డీసీఎం లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సహదీప్ మండల్ (30), బాలాజీ (50) అనే ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version