జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు…

జహీరాబాద్: కారు బోల్తా, ఆరుగురికి తీవ్ర గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బుచ్చినెల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version