జహీరాబాద్ శివారులో లారీ-డీసీఎం ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ శివారులో శుక్రవారం అర్ధరాత్రి మచిలీపట్నం-పూణే రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మహారాష్ట్ర నుండి హైదరాబాద్ కు ఉల్లిగడ్డ లోడ్ తో వెళుతున్న లారీ టైర్ పేలి డివైడర్ ను ఢీ కొనగా వెనుక నుంచి వస్తున్న డీసీఎం లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సహదీప్ మండల్ (30), బాలాజీ (50) అనే ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
