“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి…

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి”

అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తాహాసిల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు జిల్లాలోనే అధికంగా బాలానగర్ లో ఎక్కువగా పెండింగ్ లో ఉండటంతో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించరాదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ లిఖిత రెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version