గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు…

గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు

మండల అధికారులు సమావేశాలు పెట్టి ఆదేశాలు జారీ చేసినప్పటికి మారని జీ.పి.అధికారుల పనితీరు

ప్రధాన సమస్యగా వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం లేదు.వర్షాలు కురుస్తున్న సందర్భంలో గ్రామాల్లో మురికి కాలువలలో పేరుకుపోయిన మురుగునీరు,ఎక్కడ చెత్త అక్కడే వదిలేసిన తీరు చూస్తే గ్రామాల్లో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని చెప్పవచ్చు.భారీ వర్షాల కారణంగా గ్రామాలరోడ్లు బురదమయంతో నిండిపోయి మురికి కాలువలో మరియు నీరు లోతట్టు ప్రాంతాలలో నిలువఉండటం వలన ఆ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తరులు జారీ చేసిన,మండల అధికారులు సమావేశలు పెట్టి ఆదేశాలు జారీచేసినప్పడికి కొన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలపై పంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ సమయంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది టైఫాయిడ్ మలేషియా సీజనల్ జ్వరాలు ఎక్కువగా వ్యాపిచెందే అవకాశలున్నాయి.వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిసినప్పటికి కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు బ్లీచింగ్ పౌడర్ గాని దోమల మందు గాని స్ప్రే చేయడం నివారణ చర్యలు ఏమాత్రం చేపట్టలేదు.వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నిల్వవున్న నీటిని కాళీ చేసే చర్యలు కూడా తీసుకోవడం లేదని ప్రజలు పంచాయతీ సిబ్బంది పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీరు నిల్వ వల్ల ప్రాణంతకమైన దోమలు గుమిగుడుతున్నాయని కొంతమంది పంచాయతీ అధికారులు అయితే ప్రజలు తమ గోడు విన్నవించుకున్నప్పటికి కొన్ని నెలలుగా మాకు ఎలాంటి నిధులు రావడంలేదని మాట దాటేస్తున్నట్టు సమాచారం,అధికారులు స్పందించి పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తమ ప్రణాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు

వెలగని విద్యుత్ దీపాలే ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.గ్రామాలలో ఎక్కడ చూసిన వెలగని విద్యుత్ దీపాలు దర్శనమిస్తున్నాయి.ఒక చోట ఉంటే ఇంకోచోట ఉండకపోవడం ఇలా అన్ని గ్రామాలలో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు.వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏదైనా అవసర నిమ్మిత్తం బయటకు వెళ్లాల్సివస్తే విషపురుగులు కాటేస్తాయేమో అనే భయంతోనే బయటకు వెళుతున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారు.మరికొన్ని చోట్ల అయితే రోడ్లకు ఇరువైపులా భారీగా చెట్లకొమ్మలు పెరిగి విద్యుత్ దీపాలకు అడ్డుగావచ్చి రాత్రికాల సమయంలో ప్రయాణించే వాహనదారులకు వెలుగులు లేక గుంతలు కనిపించక తమ ప్రయాణం ఒక నరకంగా వాపోతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజావాణిలో ఫిర్యాదుకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు.

ప్రజావాణిలో ఫిర్యాదుకు స్పందించిన నగరపాలక సంస్థ అధికారులు

పాత మంచిర్యాల పార్కులో పారిశుధ్య చర్యలు ప్రారంభం

మంచిర్యాల,నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-30.wav?_=1

మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని పాత మంచిర్యాల శ్రీలక్ష్మీ నగర్ లో ఉన్న పట్టణ ప్రకృతి వనం ( పార్క్ ) లో నగరపాలక సంస్థ సిబ్బంది శుక్రవారం పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.అందరికీ ఆహ్లాదం పంచాలనే ఉద్దేశంతో రూ. 90 లక్షల వ్యయంతో శ్రీలక్ష్మినగర్ లో నిర్మించిన పార్క్ నిర్వహణ సరిగా లేదని, వాకింగ్ ట్రాక్ లో గడ్డి మొలచి, చెత్త పొగయిందని,తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గత సోమవారం జరిగిన ప్రజావాణి లో పాత మంచిర్యాల కు చెందిన గోగు సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై పత్రికలో వార్తలు రావడంతో స్పందించిన నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు.పారిశుధ్య సిబ్బంది వాకింగ్ ట్రాక్ లో పెరిగిన గడ్డి తొలగించి శుభ్రం చేశారు.3 రోజుల్లో పారిశుధ్య చర్యలు పూర్తిచేస్తామని, మంచిర్యాల నగర పాలక సంస్థ పర్యావరణ అధికారి ప్రవీణ్ తెలిపారు.ఫిర్యాదు చేసినప్పుడే కాకుండా వారం రోజుల కొకసారి ఈ పార్క్ లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఈ పార్క్ లో వాకింగ్, వ్యాయామం చేసే వారు కోరుతున్నారు.3 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్ లో చెట్ల మధ్య ఖాళీ మైదానం లో పెరిగిన పిచ్చి గడ్డి మొక్కలు తొలగించి ఇసుక నింపి పిల్లలు ఆదుకోవడానికి వీలుగా ఆట పరికరాలతో ప్లేయింగ్ జోన్ తయారు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు.ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు,అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. ఈ సమీక్ష సమావేశంలో క్షయ వ్యాధి నివారణలో ఆశలు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు తెమడ బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపవలసిందిగా మరియు ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కొరకై ఆరోగ్య మహిళా క్లినిక్ యందు పరీక్షలు చేయించవలసిందిగా సూచిస్తూ, మలేరియా డెంగ్యూ జ్వరాల నివారణ డ్రై డే కార్యక్రమంను పగడ్బందీగా నిర్వహించవలసిందిగా సూచిస్తూ ఆరోగ్య కేంద్ర పథకాలపై సమీక్షించినారు.
ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్. సంపత్ కుమార్, పోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ గార్లు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.

మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన.

మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-11.wav?_=2

చిట్యాల మండలంలో మహిళా సదస్సు ప్రాంగణాన్ని పరిశీలించిన చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి* ఈనెల 18వ తారీకున మహిళా సదస్సు కార్యక్రమానికి పంచాయతీరాజ్ మహిళా ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విచ్చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిళా సదస్సు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్నాం జిల్లాలోని మహిళలందరూ విచ్చేసి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన అందులో భాగంగానే శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పతకాలు , మహిళల సాధికారిక అనేక అంశాలపై ప్రసంగిస్తారు కావున వివిధ మండలాల గ్రామాల్లోని మహిళలు విధిగా జిల్లాలోని ప్రతి ఒక్క మహిళ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పి డి డిపిఎంలు ఎంపీడీవో జయశ్రీ ఎంపీ ఓ రామకృష్ణ జిల్లా అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు చిలుముల రాజమౌళి బుర్ర శ్రీను బుర్ర మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు.

పెట్రోల్ బంక్ సీజ్ చేసిన అధికారులు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామ పరిధిలోని కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న జియో పెట్రోల్ బంకును గురువారం అధికారులు సీజ్ చేశారు. టిజిబిపాస్ అనుమతి లేకుండా చాలా రోజుల నుండి బంకు నిర్మాణం జరుగుతుండగా నిర్మాణాన్ని ఆపాలని గ్రామపంచాయతీ మూడు సార్లు ఇచ్చిన నోటీసులను బంకు యజమానులు బేఖాతరు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఎంపీఓ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ముంజంపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మలత పంచాయితీ సిబ్బందితో బంకును సీజ్ చేయించారు.

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

బల్దియాను ప్రక్షాళన చేయండి…!

నూతన మున్సిపల్ కమిషనర్ కు ప్రజల విన్నపం.

పేరుకుపోతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు. వాటిని పరిష్కరించటంలో అధికారుల అలసత్వం.

మున్సిపల్ కార్యాలయంలోనే ముద్దులు పెట్టుకున్న ఉద్యోగులపై వారం గడిచిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ప్రధాన కార్యాలయంలో రాత్రి పది గంటలకు కూడా థంబ్ వేస్తున్న ఉద్యోగులు.

మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించిన చర్యలు తీసుకొని అధికారులు.

ఎక్కడ కట్టడం జరిగిన అక్కడ మున్సిపల్ సిబ్బంది ప్రత్యక్షం కావడం. ఎంతో కొంత ఇస్తే కానీ వదిలి పెట్టరు.

కమర్షియల్ కాంప్లెక్ నిర్మాణాలకు “మేయర్ ప్రత్యేక అనుమతి” ఉంటేనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఓ మహిళా కార్పొరేటర్ ఇంట్లో మున్సిపల్ సిబ్బంది పనులు?

కమీషనర్ లు వస్తున్నారు, పోతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

వరంగల్ నేటిధాత్రి.

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ ల బదిలీలో బాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు కరీంనగర్ నుండి బదిలీపై వచ్చి, శుక్రవారం నాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నూతన కమిషనర్ చాహాత్ బాజ్ పేయి. నూతన కమిషనర్ కి బల్దియాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నగర ప్రజలు కోరుతున్నారు. కమీషనర్ లు మారుతున్నారు కానీ సమస్యలు అలాగే ఉంటున్నాయి అని ప్రజల ఆవేదన.

పెరుగుతున్న గ్రీవెన్స్ దరఖాస్తులు

నగర ప్రజలు వారి సమస్యల పట్ల గ్రీవెన్స్ లో దరఖాస్తులు ఇస్తున్నారు, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సమస్యలను గుర్తించి, పరిష్కరించే దిశగా కృషి చేయాల్సిన సంబంధిత అధికారులు అలసత్వం చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతి వారం గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నూతన కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు నగర ప్రజలు.

“మున్సిపాలిటీ ముద్దులాట” లకు నోటీసులు?

ప్రభుత్వ కార్యాలయంలో ముద్దులు పెట్టుకున్న ఇద్దరు ఉద్యోగులకు “సిడిఎంఏ” నుండి నోటీసులు అందినట్లు సమాచారం. వారిపై వారం రోజులు గడిచిన ఎలాంటి చర్యలు లేవని, ఇద్దరిని వేర్వేరు కార్యాలయాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. తాము చేసిన తప్పుకు కొంచెం కూడా పశ్చాతాప్తం లేని “సదరు ఉద్యోగులు”? పైగా తాము చేసింది తప్పు కాదు అంటూ, తప్పును కప్పి పెడుతూ, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని రాజకీయ నాయకుల లాగా ఆరోపణలు చేయడం. మున్సిపల్ కార్యాలయంలో చెట్టాపట్టాల్ వేసుకొని తిరగడానికి అదేం పార్క్ కాదు, ప్రైవేట్ ప్లేస్ కాదు. పబ్లిక్ కార్యాలయం అనేది గుర్తు పెట్టుకోవాలి సదరు ఉద్యోగులు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉంది వీళ్ళ ప్రవర్తన. కొన్ని రోజులుగా వీళ్లు కార్యాలయంలో చేసే పనులు చూసి, విసిగి వేసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మారని తీరు. “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం” సినిమా లాగా మున్సిపల్ ఆఫీసులో “అన్నాచెల్లెళ్ల” బంధానికి కొత్త అర్థం చెబుతున్న కొందరు ఉద్యోగులు. గత శని, ఆదివారాలు సెలవు రోజులు లేకుంటే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రేమ జంటలపై ప్రత్యేక డిబేట్లు కూడా ఉండేవేమో. మీకేమి కాదు మేమున్నాం అంటూ ఓ అధికారి, కొందరు రిపోర్టర్లు అభయ హస్తం ఇచ్చినట్లు వినికిడి? నూతన కమిషనర్ ఈ అంశంపై చర్యలు తీసుకుంటారా లేదా అని కొందరు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అనేది తోటి ఉద్యోగుల వాదన.

థంబ్ ఎప్పుడైనా వేస్తాం మా ఇష్టం

 

 

New Municipal Commissioner.

 

 

 

 

మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి 8 గంటల తరువాత స్టైల్ గా నిక్కర్ టీ షర్ట్ వేసుకుని రావడం మున్సిపల్ కార్యాలయంలో థంబ్ వేసి వెళ్తుంటారు కొందరు ఉద్యోగులు. అసలు ఎవరు వీళ్లు ఎక్కడ పని చేస్తున్నారు రాత్రి వేళ వచ్చి థంబ్ వేయడం ఏంటి.
మరి కొందరు మహిళా ఉద్యోగులు ఏకంగా కారులో వచ్చి, దర్జాగా సాయంత్రం 7 తరువాత థంబ్ వేయడం.
వీళ్లు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు అనేది పర్యవేక్షణ చేసే నాథుడే లేడు. పట్టించుకునే అధికారి పర్వాలేదు అంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి వృతి రీత్యా ఉదయాన్నే ప్రధాన కార్యాలయంకు వచ్చి హాజరు వేసి, కొందరు బయటకు వెళ్లి నగరంలో పనిచేస్తూ, సాయంత్రం ఆరు గంటల లోపు ఆఫీసుకు వచ్చి హాజరు వేసి ఇంటికి వెళ్ళడం మనం సామాన్యంగా చూస్తాం.. కానీ ఇక్కడ వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లడం సహజం. సాయంత్రం వేళ థంబ్ వేయడానికి రాత్రి పది గంటలకు మున్సిపల్ కార్యాలయంకు వచ్చి వేయడం జరుగుతుంది అదేందో మరి అర్థం కావడం లేదు అని అంటున్నారు కొందరు ఉద్యోగులు. పని వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు అనుకున్న కానీ వీరు మాత్రం పని చేస్తున్నారో లేదో తెలియదు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మున్సిపాలిటీ ఉద్యోగులు థంబ్ వేయడంపై దృష్టి సారించాలని అంటున్నారు కొందరు ఉద్యోగులు.

ప్రధాన కార్యాలయం ముందు ప్రైవేట్ వ్యక్తి కబ్జా?

మున్సిపల్ ప్రధాన కార్యాలయం గేటు ముందు ప్రైవేట్ వ్యక్తి దర్జాగా ఆక్రమించుకొని పనులు చేయడం జరుగుతుంది. మున్సిపల్ స్థలాన్ని ఎవరు లీజుకు ఇచ్చారు ఎన్ని యేండ్ల పాటు ఇచ్చారు? అనేది అధికారులకే తెలియాలి. ప్రధాన కార్యాలయం గేట్ ముందు వినాయక విగ్రహాల తయారీకి సంబంధించిన వాటిని గేట్ ముందే పెట్టడం, రోడ్డు మీద పనులు చేస్తూ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ముందు ఆగం ఆగం చేస్తున్న పట్టించుకొని అధికారులు.

బల్దియాలో సమస్యలు అనేకం. వాటిని అధిగమించి ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తూ. నూతన కమిషనర్ తనదైన ముద్ర వేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

 

 

గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. చాహాత్ బాజ్ పేయి.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నూతన కమీషనర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశాను. అంతకంటే పెద్ద అయినా గ్రేటర్ వరంగల్ కు కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను అని తెలిపారు.

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం.

అధికారులు కృషి చేయడం వల్ల పుష్కరాలు విజయవంతం

మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి:

ప్రభుత్వం ఏదైనా ఆలోచన మాత్రమే చేస్తుందని ఆచరణలో పెట్టాల్సింది అధికారులేనని, మీలాంటి అధికారులు సమగ్ర కార్యాచరణతో నిర్విరామంగా కృషి చేయడం వల్ల సరస్వతి పుష్కరాలు విజయవంతం అయ్యాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి
దిద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన సరస్వతి పుష్కరాలు డే ఆఫ్ థాంక్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుపాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పుష్కరాలు ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అలోచన మేరకు జిల్లా యంత్రాంగం 12 రోజులు 24 గంటలు నిర్విరామంగా కష్ట పడ్డారని తెలిపారు.

క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది అమలు అవుతుందని నిరూపించారని, పుష్కరాలు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినట్లు తెలిపారు.

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సరస్వతి పుష్కరాల’ నిర్వహణను ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని నిర్బహించినట్లు తెలిపారు.

పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

నిజానికి పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదని పేర్కొన్నారు.

శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పనులు చేయడానికి ఆటంకం ఏర్పడింది, అయినా ఇంజినీరింగ్ అధికారులు పనులను.పూర్తి చేశారని అభినందించారు.

మనకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది అయినా మీరంతా కష్టపడి ఒకరికొకరు సమన్వయం చేసుకుని… ఒక టీం వర్క్ లా పనిచేసి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు.

సుమారు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి… ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకున్నారంటే అందుకు కారణం మీరేనని, మీరు పడిన శ్రమ మీరు చూపిన చొరవ విజయానికి కారణం అయ్యాయన్నారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ మార్గ నిర్దేశనంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరూ మూడు నెలలు చాలా కష్టపడ్డారని, పుష్కరాలను విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భద్రత, నీటి సరఫరా, అన్నదానం, మెడికల్ సౌకర్యాలు, శౌచాలయాలు, విద్యుత్, పారిశుధ్యం, మీడియా కవరేజి ఇలా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశారన్నారు.

యంత్రాంగం కృషి వల్లే తెలంగాణలో తొలిసారిగా కాశీ పండితుల చేతుల మీదుగా ప్రతి రోజు సాయంత్రం నిర్వహించిన ‘‘సరస్వతి నవరత్న మాలా హారతి‘‘ కార్యక్రమం మొత్తం పుష్కరాలకే ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నారు.

ఈ పుష్కరాల ద్వారా ఆర్టీసీకి సుమారు 10 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని వినియోగించుకొని లక్షలాది మంది సోదరీమణులు పుష్కరాలకు విచ్చేశారని అన్నారు.

12 రోజుల పాటు దాదాపు 9 వేల ట్రిప్పులు బస్సులు నడిచాయని తెలిపారు. కొందరు సరస్వతి పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారని, అయినా భక్తులు అవన్నీ ఏమి పట్టించుకోకుండా లక్షలలో పుష్కర స్నానాలు చేశారని అన్నారు. మీడియా మిత్రుల సహకారం గురించి.

ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాలని, ఎప్పటి కప్పుడు పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు తెలియజేసి విజయవంతంగా కావడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల కృషి ప్రశంసనీయం. వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఇది మొదటి అడుగు మాత్రమేనని రానున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

ఈ విషయంలో అసలు రాజీ పడబోమని, ఈ పుష్కరాల్లోని లోటుపాట్లను గుర్తించి అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని అన్నారు.

ముఖ్యంగా యంత్రాంగం యొక్క పాత్ర చాలా కీలకమని ప్రభుత్వం మీ వెంట ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందించారు

కాళేశ్వరానికి వెళ్లే జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్సు డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడతామని అన్నారు.

ఓవైపు అభివృద్ధి… మరోవైపు సంక్షేమంలో తెలంగాణను దేశంలోనే తొలిస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

అందులో భాగంగానే ఉచిత బస్సు, 200 లోపు యునిట్లు ఉచిత విద్యుత్, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి లాంటి అనేక ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టామని, అయినా…

కొందరు పనిగట్టుకొని మేం ఏమి చేయడం లేదంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఈ పుష్కరాల స్ఫూర్తితో అధికారులు మరింత జోష్ తో… టీం వర్క్ తో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆలోచనలు, ప్రాధాన్యాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అభినందించారు.

ప్రమాదంలో మరణించిన కొమరవెల్లి గ్రామస్థులకు లక్ష రూపాయలు ఎక్సగ్రేషియా ప్రకటించారు. అలాగే వడదెబ్బకు గురై మరణించిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జిల్లా యంత్రంగా ఆశాంతం కష్టపడి పనిచేసి సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసినట్లు తెలిపారు.

సరస్వతి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించిన యంత్రాంగం యొక్క కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి విజయానికి తోడ్పడ్డారని తెలిపారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో మంత్రి శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పుష్కరాలు విజయవంతంగా కావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.

కొమరపల్లి గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయారని ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయాలని సూచించారు. కనువిప్పు కలిగి విధంగా విజయవంతం చేశారని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సిబ్బందిని అధికారులను ఆయన అభినందించారు.

రానున్న గోదావరి పుష్కరాలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని గోదావరి పుష్కరాలకు కుంభమేళాలను మైమరిపించే విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఏలాంటి లోటుపాట్లు రాకుండా చేసేందుకు సరస్వతి పుష్కరాల అనుభవం దోహదపడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ యంత్రాంగమంతా ఒకతాటిపై నిలబడి అహర్నిశలు శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.

సమగ్ర ప్రణాళికలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. 12 రోజులపాటు సరస్వతి పుష్కరాలను అత్యంత విజయవంతంగా నిర్వహించామని ప్రతి ఒక్కరిని అభినందించారు.

మూడు నెలల ముందు నుంచి సమగ్ర ప్రణాళికలు చేశామని 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను ప్రణాళికలు ప్రకారం నిర్వహించామని తెలిపారు.

రోజురోజుకు భక్తులు రద్దీ పెరిగిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు తెలిపారు.

కాళేశ్వరం చిన్న గ్రామమైనప్పటికీ 30 లక్షలు కంటే ఎక్కువ మంది భక్తులు భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ 12 రోజులు రేయింబవళ్ళు విధులు నిర్వహించారని అన్నారు.

పుష్కరాలు ముందు పుష్కరాలు తర్వాత పారిశుధ్య కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యమని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ ఎలాంటి అంతరాయం లేకుండా 24*7 నిరంతరం విద్యుత్ అందించారని అభినందించారు.

వర్షాలు వచ్చి రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన 30 నిమిషాల్లో విద్యుత్ సేవలు పునరుద్ధరించారని అభినందించారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది, ఎన్డిఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మెడికల్ సిబ్బంది వడదెబ్బ నుండి భక్తులను కాపాడారని తెలిపారు.

పోలీస్ శాఖ వాహన రద్దీ పెరుగుతున్న క్రమంలో రాత్రికి రాత్తే పార్కింగ్ ఏర్పాటు చేసి ఉచిత షటిల్ బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించారని తెలిపారు.

ఆర్డబ్ల్యూఎస్ నిరంతరాయ మంచినీరు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని అన్నారు. 45 డిగ్రీలు కంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్నది, అనుకోకుండా అధిక వర్షపాతం వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్లామని తెలిపారు.

దేవాదాయ ధర్మదాయ శాఖ పనితీరును ఆయన అభినందించారు.

దేవాలయంలో భక్తులు నియంత్రణ చర్యలు రెడ్డిని చాలా బాగా మేనేజ్ చేశారని అభినందించారు.

ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణలతో ముందుకు వెళ్ళామని సీఎస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ తదితరులు సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు.

హైదరాబాద్ నుండి ప్రతిరోజు పర్యవేక్షణ చేశారని వారి సూచనలు విజయవంతానికి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు.

అనంతరం పుష్కరాల విధులు నిర్వహించిన జిల్లా అధికారులను, సిబ్బందిని శాలువా, మెమెంటో తో అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం విజయభాను, ఆర్డిఓ రవి, ఎస్పి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

విత్తన దుకాణాలపై పోలీసులు.

విత్తన దుకాణాలపై
పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త దాడులు

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పలు విత్తన దుకాణాలపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శనివారం వారు మండల కేంద్రంలోని సూర్య తేజ విత్తన దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరసింగ్, ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందియాలని కోరారు. రైతులకు పలు సూచనలు చేశారు.లైసెన్స్ ఉన్న దుకాణాలలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు అవునో కాదు నిర్ధారించాలి. లూజ్ విత్తనాలు ఎవరు కూడా తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి విత్తనానికి డీలర్లు వద్ద బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. విత్తన ప్యాకెట్టు కూడా పంట చివరి వరకు దాచుకోవాలని తెలిపారు. ఈ దారులలో మండల వ్యవసాయ శాఖ అధికారి బి వీరా సింగ్,ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన.

రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు.

◆ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో గుంతలమైన అల్గొల్ బైపాస్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్ నుండి భరత్ నగర్ ,అల్గోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు శుక్రవారం స్థానిక నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్ & అండ్ బి ఈఈ , సీఈ తో ఫోన్లో సంభాషిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు . గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ రోడ్డు సమస్య పరిష్కారానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేశామని , కాంట్రాక్టర్ కేవలం బ్రిడ్జ్ మాత్రమే నిర్మించి అప్ప్రోచ్ రోడ్డు నిర్మించకుండా వదిలేసాడని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తొందరగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని లేనియెడల ధర్నాకు దిగుతామని హెచ్చరించారు, ఈ రోడ్డు ద్వారా వెళ్లే వాహనదారులు క్షేమంగా వెళ్లే విధంగా తక్షణమే తాత్కాలిక మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే స్థానిక అధికారులకు ఆదేశించారు ,కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, యువ నాయకులు మిథున్ రాజ్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్పా,నాయకులు పురుషోత్తం రెడ్డి,దీపక్ ,నరేష్ రెడ్డి,సందీప్,ఫయాజ్,అశోక్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, అనిల్ ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్.

అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశం.

రైతులపై అక్రమ కేసుల నమోదుకు నిరసనగా ధర్నా

పోలీస్ అధికారులకు వెంటనే ఫోన్లో ఆదేశం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి.

బెల్లంపల్లి నేటిధాత్రి:

వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడాన్ని తీవ్రంగా పరిగణించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ రోజు న్యాయవాది, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు రైతులకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. గత యాభై సంవత్సరాల నుండి రైతులు చామనపల్లి శివారులోనీ సర్వే నెంబర్ 65, 67 లో సాగు చేస్తున్నారని అన్నారు. ఆ భూముల్లో విద్యుత్ మోటార్లు, స్తంభాలు, బోర్లు వేసుకొని వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పట్టా పాసు పుస్తకాలు ఇచ్చిందని, లోన్లు, రుణమాఫీ చేసిందని అన్నారు. 1997లోనే ఫైనల్ పట్టా ఇచ్చిందని తెలిపారు. గత సంవత్సరం నుండి అటవీశాఖ అధికారులు ఈ భూములు అటవీ శాఖ కు చెందినవని రైతులపై దాడులు చేస్తూ, అక్రమంగా కేసులు నమోదు చేసి రైతులను జైలుకు పంపించారని తెలిపారు. అటవీశాఖ అధికారుల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే జైపూర్ ఏసీపికి, నీల్వాయి ఎస్ఐ కి పోన్ చేసి అటవీశాఖ అధికారుల పై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో నీల్వాయి పోలీస్ స్టేషన్ లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు మున్నరాజ సిసోడియా, బిజెపి జిల్లా నాయకులు దుర్గం ఎల్లయ్య, రైతులు బానయ్యా, లింగయ్య, పర్వతాలు, మధుకర్, బాధిత రైతులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు.

అనుమతులులేని…అక్రమ నిర్మాణం…!

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు

పట్టింపె లేదా ఏ…? అధికారులకు…

అక్రమ నిర్మాణ యజమానిపై ఇంత ప్రేమ ఎందుకో…!

సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ నిర్మాణ సమస్యలు

నోటీసులతో సరి పెట్టుకుంటారా..? కోరాడ జులిపిస్తారా…

చేతులు తడిపినందుకేనా అనే అనుమానాలు?

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం పట్టణ కేంద్రం లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చకంగా కొనసాగుతున్నాయి.ఇది అధికారుల అలసత్వమా…? లేదా నిర్లక్ష్యమా…? లేక అక్రమ నిర్మాణదారుల బరితెగింపులా…? అనీ కేసముద్రం పట్టణ ప్రజలు ముక్కున వెలుసుకుంట్టున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.ఒక సామాన్యుడు రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పర్మిషన్ల పేరుతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆ పేపరు ఈ పేపర్ తీసుకురా అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకునే సందర్భాలు ఎక్కువే అంటున్న ప్రజలు, అధికారులు మాత్రం డబ్బు పలుకుబడి ఉన్న వ్యాపారస్తు లు డబ్బున్న బడా బాబులు అని చెప్పుకునే వారి నిర్మాణ సముదాయలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్న కాని అధికారులు చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వెనుక ఆ అధికారులపై ప్రజలు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అక్రమ నిర్మాణ దారులు నన్ను ఎవరేం చేయలేరు అనే ధీమాతో నిర్మాణాలు పూర్తి పూర్తి చేస్తున్న సంఘటనలు. యాదేచ్చకంగా అధికారుల కళ్ళేదుట బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవనం ఏదే చ్చగా అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు నిర్మించినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది..వివరలోకి వెళితే కేసముద్రం పట్టణ కేంద్రం నడిబొడ్డున మార్కెట్ రోడ్ ప్రధాన రహదారి లో భద్రకాళి టెక్స్టైటైల్స్ షాపింగ్ కాంప్లెక్స్ జి ప్లస్ టు..

construction

అనుమతులు పొంది పంచాయతీరాజ్ చట్టం – 2018 నియమ నిబంధనలను అతిక్రమించి జి ప్లస్ టు ఉన్న నిర్మాణాన్ని బహుళ అంతస్తుల అనగా ఐదు పోర్లతో పేక మేడ లాంటి అక్రమ నిర్మాణం చేపట్టి ఎలాంటి ఫైర్ సేఫ్టీ మరియు వెంటిలేషన్ రూల్స్ పాటించకుండా నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో అంత పెద్ద బహుళ అంతస్తులు నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా? అంతటి అంతస్థకు ఆ ప్రదేశంలోని నేల సరి అయినదేనా కాదా అది తేల్చాల్సింది జులాజికల్ మైన్స్ అధికారులు నేల పరీక్ష తదనంతరం అనుమతులు తప్పనిసరిగా పాటించాలి అలాగే ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా గాలి రావడానికి పోవడానికి ఒక్క కిటికీ కూడా నిర్మించకుండా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒకటే గుమ్మం ఒకటే దారితో కూడిన డోర్ నిర్మాణం చేశారని అలాగే నాలుగు అంతస్తులకు గాను లిఫ్ట్ నిర్మించారని ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ సిబ్బందికి వెళ్లే మార్గమే లేదని షాపులో పనిచేసే అటువంటి వర్కర్స్ కి మరియు షాపింగ్ మాల్ వచ్చినటువంటి వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉందని మనుషుల ప్రాణాలతో చెలగాటమేనని పలువురు భావిస్తున్నారు.కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకుండా సేఫ్టీ అనుమతులు అవేమీ లేకుండా ఎలా నిర్మిస్తారని, అనేక ప్రశ్నలకు తావిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.అట్టి బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవన నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలకు ప్రమాదం జరుగుతుందని అనేది చర్చ జరుగుతుంది.గతంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అదనపు అంతస్తుల నిర్మిస్తున్న సమయంలో ఒక భవన నిర్మాణ కార్మికుడు పై అంతస్తూ నుండి పడి మృతి చెందిన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన ఏ మాత్రం నిర్మాణం ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసిన పరిస్థితి కళ్ళముందే కనబడుతుంటే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.ఎన్నో సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్న కూడా అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో…?అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు చట్టాలను కేవలం నిరుపేదలపై సామాన్యులపై ప్రయోగిస్తారా.బడా వ్యాపారస్థులకు డబ్బు పలుకుబడి దారులకు కొమ్ము కాస్తున్నారని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు అనుకున్నట్టుగానే పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణదారులపై కొరడా జులిపించాలని వెంటనే స్పందించి పంచాయతీ రాజ్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకోవాలని,అలాగే ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని ఇకనైనా మున్సిపల్ అధికారి మరియు పంచాయితీ అధికారులు చట్టాలపై నమ్మకం కలిగిస్తారా లేదా అని ప్రజలు వేచి చూస్తున్నారు.

మండలంలో అధికారులు నాయకుల.!

మండలంలో అధికారులు నాయకుల చే. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల. నిర్మాణానికి మొదటిగా సారిగా మండలంలోని సారం పెళ్లి గ్రామంలో అధికారులచే నాయకులచే భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని కలిగి ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందని. మండలంలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిందని అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుందనినిర్మాణంలో నిధులు మంజూరుకు లబ్ధిదారులు అధికారులను. దళారులను ఆశ్రయించవద్దని లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవతం చేసి ఇందిరమ్మ ఇంటి కల సాకారం చేసుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ల దోపిడీకి తెర లేపారని ప్రజా ప్రభుత్వంలో అటువంటి వాటికి తావు లేదని ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో ప్రభుత్వం విడు
త ల. వారీగా రుణాలు మంజూరు చేస్తారని.ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి . చిత్రపటాలకు లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల.రాజు ఆధ్వర్యంలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో . పంచాయతీ సెక్రెటరీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిల. రాములు. ఎండి హనీ. గడ్డమీది శ్రీనివాస్. సుంచుల కిషన్. సిరిసిల్ల దేవదాస్. బాలరాజు. అంజయ్య. పురుషోత్తం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

11KVవైర్లు వేలాడుతున్న పట్టించుకోని అధికారులు.

11 కెవి వైర్లు వేలాడుతున్న పట్టించుకోని అధికారులు

నిజాంపేట్, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ రైస్ మిల్ పక్కన రైతు టేకుమల్లె యాదయ్య పోలంలో వేలాడుతున్న 11 కెవి కరెంటు వైర్లు నెత్తి పైన మీటర్ దూరంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. అని ఎన్నిసార్లు సంబంధిత లైన్మెన్ కు విద్యుత్ అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉందని ప్రస్తుతం ఆ స్థలంలో వరి పంటలు కోసి ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సందర్శించి ఆ యొక్క వేలాడుతున్న వైర్ల నుంచి ప్రమాదం జరగకుండా కాపాడుతారని రైతు యాదయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని రైతు యాదయ్య తెలిపారు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు.

బస్ షెల్టర్ నిర్మించిన ఆర్టీసీ అధికారులు..

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ

పోచంమైదాన్ బస్ షెల్టర్ పై, కొన్ని రోజులుగా వార్తలు ప్రచురించిన “నేటిధాత్రి”.

“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ కు అభినందనలు

ఎక్స్ అకౌంటు (ట్విట్టర్) ద్వారా ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన “నేటిథాత్రి” పత్రిక

ఎట్టకేలకు పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి

షెల్టర్ నీడన ప్రయాణికులు.. “నేటిధాత్రి” పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

బస్ షెల్టర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బిల్డింగ్ ఓనర్, ఆర్టీసీ అధికారుల పైకి ఎదురు దాడి ప్రయత్నం

అండగా నిలబడి నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్..

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

వరంగల్ తూర్పు పరిధిలో, పోచంమైదాన్ జంక్షన్ వద్ద ఉన్న బస్సు స్టాండ్ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా ఉన్న బస్ స్టాండ్ ను తొలగించారు. అదే స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టిన అధికారులు, పైకప్పు (షెల్టర్) వేయడం మర్చిపోయారు. దీంతో మహిళలు, ప్రయాణికులు కొన్ని రోజులగా నానా ఇబ్బందులు పడ్డారు. బస్ స్టేషన్ కు పైకప్పు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల సమస్యను నేటిధాత్రి పత్రిక, “బస్ షెల్టర్ నిర్మించండి సార్” అని, “బస్ షెల్టర్ నిర్మించండి మంత్రి గారు” అని బస్టాండ్ సమస్యపై, అనేకసార్లు వార్తలు రాసి, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి. సోషల్ మీడియా ఎక్స్, (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన నేటిదాత్రి పత్రిక. పిర్యాదుకు స్పందించిన ఆర్టీసీ ఎండీ, మే 14, బుధవారం నాడు మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు, వారి పర్యటనలో భాగంగా ఖిలా వరంగల్ కు బుధవారం రానున్న నేపథ్యంలో, నగరాన్ని సుందరీకరణ చేస్తున్న విషయం తెలుసుకొని, జిల్లా ఆర్టీసీ అధికారులకు బస్
షెల్టర్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో. వెంటనే స్థానిక ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేశారు. నిలువ నీడ చేకూర్చిన ఆర్టీసీ అధికారులకు, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రిక కు, స్థానిక కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియచేశారు ప్రయాణికులు.

RTC bus

బస్ షెల్టర్ నిర్మాణం ఆపాలని, ఆర్టీసీ అధికారులతో వాగ్వాదం

బుధవారం ఉదయం ఆర్టీసీ అధికారులు పోచంమైదాన్ కు చేరుకొని, బస్ షెల్టర్ నిర్మాణం చేస్తుండగా, పక్కనే ఉన్న బిల్డింగ్ యజమాని కుమారులు వచ్చి, ఆర్టీసీ మహిళ అధికారిని పైకి ఇనుప రాడ్డుతో దాడి చేయబోయి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్డుతో దాడి చేయబోయే సంఘటనపై వీడియో తీసిన ఆర్టీసీ అధికారులు వీడియోను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ఓ టౌన్ ప్లానింగ్ అధికారి సైతం వచ్చి బస్ షెల్టర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆర్టీసీ అధికారులపై రుబాబు మాటలు మాట్లాడటంతో, మున్సిపల్ కార్పొరేషన్ “పెద్దల సహకారం” బిల్డింగ్ ఓనర్ కు ఉంది అనే అనుమానాలకు తావిచ్చింది. బిల్డింగ్ ఓనర్ కుమారులు మాట్లాడుతూ, నగర మేయర్ మేడం మాకు సపోర్ట్ గా ఉంది అని చెప్పడం గమనార్హం.

RTC bus

స్పందించిన స్థానిక కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్

బస్ షెల్టర్ వద్ద నిర్మాణం అడ్డుకున్న వ్యాపారితో మాట్లాడిన స్థానిక కార్పొరేటర్. ఇరువురికి నచ్చచెప్పిన తరువాత ఆర్టీసీ అధికారులు పని మొదలు పెట్టారు. దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిన స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్. బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు.

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను.!

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

 

 

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వరి పంటను పరిశీలించిన అధికారులు.

వరి పంటను పరిశీలించిన అధికారులు

బాలానగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి పంట నేలపై ఓరిగి నేలపై వరి గింజలు రాలాయి. సుమారు మండలంలో 300 ఎకరాలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బి.వెంకటేష్ శనివారం గౌతాపూర్ గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్.!

ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్…

జహీరాబాద్ నేటి దాత్రి:

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు రెవెన్యూ అధికారుల సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్హేర్ నాయబ్ తహశీల్దార్ పవన్ కుమార్, జహీరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదిలాల్ ను సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పవన్ కుమార్ జహీరాబాద్ లో పనిచేసే సమయంలో భూమి వారసత్వ బదలాయింపు దరఖాస్తుపై సరైన విచారణ చేయనందుకు సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్ష

ధాన్యం కొనుగోలు పై అధికారుల తో సమీక్ష
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవు, వాతావరణ శాఖ వెల్లడి
రైతులు అధైర్య పడవద్దు / ఆందోళన చెందవద్దు
మిల్లుల అలాట్మెంట్ జరగని కొనుగోలు కేంద్రాల ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోదాములకు తరలించాలి
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ,రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతముగా జరగాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 246 కొనుగోలు కేంద్రాలకు గాను 244 కేంద్రాల ప్రారంభం చేసి 224 కొనుగోలు కేంద్రాల నుంచి 28వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసిల్దార్ లు సిరిసిల్లలో అపెరల్ పార్క్ లో మరియు ఇతర చోట్ల అవసరమైన ఇంటర్మీడియట్ గోదాములను గుర్తించి ధాన్యం తరలింపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేసిన రైస్ మిల్లర్లకు సామర్థ్యం ప్రకారం ధాన్యం అలాట్మెంట్ చేయాలని అన్నారు. జిల్లాలో రానున్న 10 రోజుల్లో వర్షాలు లేవనీ వాతావరణ శాఖ వెల్లడించినందున రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని సెంటర్లలో టార్ఫాలిన్ కవర్లు, అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన వసతులు కల్పించాలని, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్ కవర్లు, వెయింగ్ యంత్రాలు తేమ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో పెట్టుకొవాలని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు. జిల్లాలో 500 లారీలు అందుబాటులో ఉన్నందున ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డి.ఎం.పౌర సరఫరాల శాఖ రజిత, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్, ఏ.పి.ఎం, తదితరులు పాల్గొన్నారు.

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

నీటి సమస్యపై స్పందించిన సింగరేణి అధికారులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల అబ్రహం నగర్ ,సర్దార్ వల్లభాయ్ నగర్ ఏరియాలో నివసించే సింగరేణి కార్మికులకు, మంచినీళ్లు అందించేలా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాకుబ్ ఆలీ సింగరేణి అధికారులను కోరారు. స్పందించిన సింగరేణి అధికారులు శనివారం కల్వర్టులో ఉన్న కొన్ని నీటి పైపులైన్లను తొలగించి నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేశారు. నీటి సమస్య ఉందని తెలిపిన వెంటనే స్పందించిన సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి యాకూబ్ అలీ అన్నారు. లింగేశ్వర పాఠశాల నుండి అబ్రహం నగర్ బోర్డ్ వరకు కూడా కొత్త పైప్ లైన్లు వేయాలని సింగరేణి అధికారులను కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కి నూతన నీటి పైప్ లైన్ వేయించాలని కోరడం జరిగిందని తెలిపారు.స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని, కాలనీ వాసుల నీటి అవసరం నిమిత్తం నూతన పైప్లైన్ వేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని యాకుబ్ ఆలీ అన్నారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.

పలు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం చలివేంద్రల ఏర్పాటు చేసిన అధికారులు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు సీఈవో గణపతి మిట్టపల్లి గ్రామంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ నర్వ జైపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని గ్రామ ప్రజలకు,ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు చలివేంద్ర కేంద్రాలను గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయమని అన్నారు.ప్రజలకి కాకుండా పశువులకు,పక్షులకు కూడా ప్రజలు తమతమ నివాసాలలలో ధాన్యాన్ని నీళ్లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ గ్రామ నాయకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version