ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రకృతి వైశాల్యాలు
రూపాయి కూడా ఆదుకోలేదు.

మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళాం తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది.

తడిసిన ధాన్యాలకు కొనుగోలు చేయండి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది.

మహాదేవపూర్- నేటిధాత్రి:

 

ప్రకృతి వైఫల్యానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, అనుకోకుండా ప్రకృతి వైఫల్యాలకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేయడానికి ఖండించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో నాయకులు మాట్లాడుతూ,గురువారం అర్ధరాత్రి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలోని పిఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రంలో వడ్లు తడవడం జరిగిందన్న విషయం వాస్తవమే , కానీ ప్రకృతి సంభవించిన వైఫల్యానికి అమాయక రైతులు నష్టపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులకు భరోసా కలిగించడం జరుగుతుందని అన్నారు. పేద రైతులకు అష్టపోకుండా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తక్షణమే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు తరలించి కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించడం కూడా జరిగిందని అన్నారు. పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో 176 రైతుల వడ్లు అందగా వాటిలో 63 రైతుల వడ్లు ఎక్కువ శాతం తడవడం జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు నష్టం కలగకుండా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించడంతోపాటు, రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని తరలించడం జరిగిందని, నేటికీ కూడా వడ్లను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కానీ కాంగ్రెస్ బిజెపి, రాజకీయం చేస్తుందని, కొనుగోలు కేంద్రం వద్ద వచ్చి ప్రభుత్వం వైఫల్యం, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పై బురదజల్లే విధంగా వ్యవహరించడం సమంజశం కాదని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మార్లు ప్రకృతి వైఫల్యంతో పత్తి ,మిర్చి,వరి, రైతులు పంటలు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయని కానీ, ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా తడిసిన వడ్లను కొనుగోలు ప్రక్రియ చేపట్టి రైతులకు ఆదుకొనుటకు మంత్రి భరోసా కలిగించడం జరిగిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టం వాటిల్లకుండా ఇస్తుందని తమకు నమ్మకం ఉందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు రాణి భాయ్, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్, ఎంపీటీసీ సుధాకర్, సమ్మయ్య, మాజీ చైర్మన్ రామన్ రావు, లు ఉన్నారు.

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు.

ప్ర‌కృతి విప‌త్తును రాజ‌కీయం చేస్తున్నారు

ప్ర‌మాదంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే స్పందించింది.

నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి.

మాజీ మంత్రి హ‌రీష్ రావుతో స‌హా బీఆర్ఎస్ నేత‌లు రాజకీయ ప్రయోజనాలు, త‌మ ఉనికి కోస‌మే బీఆర్ఎస్ నేత‌లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభ‌వ‌న్ లో శుక్ర‌వారం మంత్రి జూప‌ల్లి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత‌లు బాధ్య‌త‌ర‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని, ఎస్ఎల్బీసీపై నిస్సిగ్గుగా బీఆర్ఎస్ నేత‌లు దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి.. పబ్బం గడుపుకుంటున్నారని మండిప‌డ్డారు. ఎస్ఎల్బీసీ ప్ర‌మాద ఘటనపై మా ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, సీయం రేవంత్ రెడ్డి గారు ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తూనే ఉన్నార‌ని, మంత్రులం క్షేత్ర‌స్థాయిలో ప‌ర్యవేక్ష‌ణ చేస్తున్నామ‌ని వెల్లడించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీం శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని, నిపుణుల బృందం స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కే స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై ముందుకు సాగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 8 మంది ప్రాణాలతో ముడిపడ్డ సంఘటన జరిగితే.. బీఆర్ఎస్ శ‌వాల మీద పేలాలు ఏరుకున్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ టన్నెల్ ఏడుగురు చ‌నిపోతే మీలాగా మేము శ‌వ‌రాజ‌కీయాలు చేయ‌లేదని, అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావు సంఘ‌ట‌న స్థలానికి వెళ్లారా అని ప్ర‌శ్నించారు. కొండ‌గ‌ట్టు బ‌స్సు ప్ర‌మాదం, పాల‌మూరు రంగారెడ్డి ప్ర‌మాదం, శ్రీశైలం ప‌వ‌ర్ హౌస్ లో అగ్నిప్ర‌మాదం వంటివి చోటు చేసుకున్న‌ప్పుడు అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రి, మంత్రులు సంఘ‌ట‌న స్థలానికివెళ్ల‌డం కానీ, బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన దాఖ‌లాలు లేవని స్ప‌ష్టం చేశారు. శ్రీశైలం ప‌వ‌ర్ హౌస్ లో ప్ర‌మాదం జ‌రిగితే అప్పుడు పీసీసీ అధ్య‌క్షులుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్నార‌ని, అయినా మా ప్ర‌భుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ నేత‌ల‌ను అడ్డుకోలేదని తెలిపారు. వంద‌లాది కార్ల‌లో మందిమార్బ‌లంతో యుద్ధానికి వెళ్లినట్లు ఎస్ఎల్బీసీ సంద‌ర్శ‌న‌కు వెళ్లార‌ని ద్వ‌జ‌మెత్తారు. సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ఎస్ఎల్బీసీకి ఎందుకు రాలేద‌ని నిల‌దీశారు. కృష్ణ బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్ట్ ల‌ను నిర్ల‌క్ష్యం చేసిందే గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వమ‌ని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విషయంలో రాద్ధాంతం చేయ‌డం తగదని హిత‌వు ప‌లికారు. న‌ల్గొండ ప్ర‌జ‌ల సాగు, తాగునీటి క‌ష్టాలు తీర్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.ఇత‌ర సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణంలో వంద‌ల కిలోమీట‌ర్లు తవ్వామ‌ని గొప్ప‌గా చెప్పుకునే హ‌రీష్ రావు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ను వారి హాయంలో ఎందుకు పూర్తి చేయ‌లేదని?, ఎస్ఎల్బీసీలో ఇలాంటి ప్ర‌మాదం జరుగుతుంద‌ని ముందే క‌లగ‌న్నారా? లేదా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ వ‌స్తుంద‌ని పూర్తి చేయ‌లేకపోయారో ? ఆయ‌న స‌మాధానం చెప్పాల‌న్నారు.

ప్రకృతి వైపరీత్యాలవల్ల జరిగే ప్రమాదాలపై ఎన్సీసీ స్టూడెంట్స్ కు అవగాహన

మొగుళ్ళపల్లి ఫిబ్రవరి 8 నేటి ధాత్రి

మండలంలోని జెడ్ పి హెచ్ ఎస్ మొట్లపల్లి పాఠశాలలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారిచే మొగుల్లపల్లి, మొట్లపల్లిలో. ఎన్.సి.సి. విద్యార్థులకు ,విపత్తులు,వాటి నివారణ చర్యలు అవగాహన కార్యక్రమం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి. లింగాల కుమారస్వామి, పాల్గొని మాట్లాడుతూ మానవ తప్పిదాలు లేదా ప్రకృతి,వైపరీత్యాల వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలు, సునామిలు, భూకంపాలు, వచ్చినపుడు ఏ విధంగా అప్రమత్తం కావాలో ఎన్.సి.సి విద్యార్థులుగా,మీరు ఏ విధoగా నివారించాలో, ప్రయోగాలు చేసి ఎన్.డి.ఆర్.ఎఫ్.బృందం విద్యార్థులకు విపత్తుల నివారణ చర్యలను గురించి ఆచరణాత్మకంగా చూపించి విద్యార్థులకు కళ్లకు కట్టినట్టుగా చూపించడమే కాకుండా విద్యార్థులు కూడా ఆచరింప చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సి హెచ్ రఘు, మొగుల్లపల్లి ఎన్ సీసీ అధికారి
జి రాజయ్య, ఎన్డీఆర్ఎఫ్. అధికారి సుశాంత్ కుమార్, ఎన్టీఆర్ఎఫ్ బృందం, సీనియర్ ఉపాధ్యాయులు నరసింహ స్వామి, సంపత్ కుమార్ , వీరయ్య, రవీందర్, ఉమారాణి, గ్లోరీ రాణి, శకుంతల, శోభారాణి, కవిత, సందీప్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version