పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఉచిత గ్యాస్ పంపిణీ

లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న

*పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్
నాధ్ రెడ్డి…

దీపం పథకాన్ని దేశంలోనే మొట్ట మొదటగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందన్నారు,

పెద్దపంజాణి (నేటి ధాత్రి:

 

 

పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో శాసనసభ్యులు అమరనాథ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేపట్టారు. అనంతరం చెత్త సేకరణ బండ్లను ప్రారంభించారు*.
ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ*…..
అర్హులందరికీ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని
ఆయన అన్నారు,
దీపం పథకాన్ని దేశంలోనే మొట్ట మొదటగా చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందన్నారు,
ప్రస్తుతం దీపం పథకం-2 ద్వారా ఏడాది కి మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగిందని ఈసందర్బంగా
ఆయన మీడియా తో తెలిపారు,

 

మహిళలను ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరంగా ముందుకు తీసుకొస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది కుటుంబం బాగుంటే ఊరు బాగుంటుంది… ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుందని ఆయన కొనియాడారు,
డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళలకు పొదుపును అలవాటు చేయడం జరిగింది*…
అదే ధోరణితో మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దాలని చంద్రబాబు గారు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తూ మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగే కార్యక్రమాలు చేస్తున్నారు….మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ
ఈ సందర్బంగా ఆయన తెలిపారు,
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ పథకాలను అందించడం జరిగిందని
ఆయన అన్నారు,
ఐదేళ్లకు ఓ ప్రభుత్వాన్ని మార్చే నిర్ణయంతో అందరు నష్టపోతామని గుర్తించండి అని రాయలపేట గ్రామ
ప్రజలకు ఆయన సూచించారు,
రాయల పేట పరిసర ప్రాంతాలకు కూడా హాంద్రినీవా నీళ్లు తీసుకోచ్చేందుకు కృషి చేస్తున్నాం.. ఈ విషయమై సీఎం కి కూడా తెలియజేయడం జరిగింది… త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తాంమని ఆయన ఈసందర్బంగా తెలిపారు,
గత ప్రభుత్వ తప్పిదాలతో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి సృష్టించారు… అయితే నేడు పెట్టుబడులు తెచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్ మరియు ఇతర మంత్రులు పెట్టుబడుల వేటలో తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు,
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం పెరుగుతుంది తద్వారా మరిన్ని అభివృద్ధి,సంక్షేమ పథకాలను చేపట్టుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు,
రాయలపేట పరిసర ప్రాంతంలో నెలకొన్న సెల్ టవర్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు,
ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామన్నారు,
రాయలపేట మండల కేంద్రంగా ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతం… భవిష్యత్ లో నియోజకవర్గాలు, మండలాలు పునర్విభజన కాబోతున్నాయి… ఆ సందర్భంలో అవకాశం ఉంటే మండల కేంద్రంగా చేసుకుందామన్నారు,
రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో మా కుటుంబం నిలబడేందుకు సహకరించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన అన్నారు,
ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు…అందరికీ మంచి జరగాలని ఆయన కోరారు,
స్థిరమైన ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి భవిష్యత్ లోనూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని
ఆయన పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో మండల అధికారులు సిబ్బందితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

గొప్ప పరిపాలనాదక్షుడు చంద్రబాబు నాయుడు.

గొప్ప పరిపాలనాదక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది…

సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతం…

దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రన్న…

తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ…

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు(నేటి ధాత్రి) ఏప్రిల్ 19:

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప పరిపాలనాదక్షుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు.
తెలుగు ఉమ్మడి రాష్ట్రాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన మేటి రాజకీయ వేత్త చంద్రబాబు నాయుడు అని ప్రశంసించారు.., సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన గౌరవం బాబు సొంతమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 75 వ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు జాతి ముద్దు బిడ్డ.., రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి శనివారం ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ.. విలువలు కలిగిన రాజకీయ వేత్తగా. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి.., తెలుగు ప్రజల అభ్యున్నత కోసం పరితపించిన ప్రజా ప్రతినిధి,పాలనాదక్షుడు
నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారాయన.
అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు అని. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేసాయన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిత్య కృషీవలుడన్నారు, ముఖ్యమంత్రిగా..తెలుగు దేశం పార్టీ అధినేతగా.., ప్రజాసేవకుడిగా… ఆయన అందిస్తున్న సేవలు నిరుపమానమన్నారు.
ఆధునిక యుగానికి చంద్రన్నను
రోల్ మోడల్ గా నిలిపాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు అభినందించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తూరు ఎంపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ను సర్వతో ముఖాభివృద్ది వైపు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version