ఎన్నికల ప్రక్రియ పరిశీలన
పరకాల,నేటిధాత్రి
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రక్రియను బుధవారం ఎన్నికల పరిశీలకు శివకుమార్ నాయుడు మరియు హనుమకొండ అదనపు కలెక్టర్,ఐఎఎస్ ఎన్.రవి పరిశీలించారు. అనంతరం గణపతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్,డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన అనంతరం పలు సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్.కన్నం నారాయణ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య,తహసిల్దార్ విజయలక్ష్మి,ఎంపీడీవో రవీందర్,ఎంఏఈ రంజిత్,టీపిఓ సుష్మ ఉద్యోగులు పాల్గొన్నారు.
