మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య.

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గద్దెరాగడి లోని భీమ గార్డెన్ లో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో నూతన కమిటీని, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి అలుగుల సత్తయ్య, కోశాధికారి గా మేకల సురేందర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామిడి కుమార్, ముఖ్య సలహాదారుగా పల్లె రాజు, ఉపాధ్యక్షులుగా సుధాకర్, మహేందర్, సత్తయ్య, సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడారు. మున్నూరు కాపు సంఘం బలోపేతానికి కృషి చేస్తామని, సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్న సరే సంబంధిత బాధ్యులకు తెలియజేస్తే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version