రోడ్ల మరమ్మత్తులు తప్పనిసరి…

రోడ్ల మరమ్మత్తులు తప్పనిసరి

గుంతలను పుడ్చాలని ప్రజల వేడుకోలు

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో రోడ్ల పరిస్థితి అక్కడక్కడ దెబ్బతినడంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా కూరగాయల మార్కెట్ సమీపంలో,మాదారం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద,బస్టాండ్ కూడలి వద్ద ఉన్న రహదారి గుంతలతో నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రతిరోజూ ఈ మార్గంలో భారీగా రాకపోకలు సాగుతుండగా,రోడ్డు దెబ్బతినడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.గుంతలు పెద్దవిగా మారడంతో ద్విచక్ర వాహనదారులు,ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో గుంతలను వెంటనే పూడ్చాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.కనీసం తాత్కాలికంగా అయినా మరమ్మత్తులు చేపట్టి రహదారిని సరిచేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని,సమస్యను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version