*మీరు సక్రమంగా పనులు చేయగలరా.. చేయలేరా…

*మీరు సక్రమంగా పనులు చేయగలరా.. చేయలేరా…

*అభివృద్ధి పనుల్లో పురోగతి ఏది..

*మాటలతో కాలాన్ని వృధా చేయడం తగదు…

*నెల రోజుల్లోపే అభివృద్ధి పనులు మొదలవ్వాలి.. లేకుంటే చర్యలు తప్పవు…

*అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే ఆగ్రహం…

పలమనేరు(నేటిధాత్రి:

 

 

 

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో మీరు కలసి సక్రమంగా పని చేయగలరా
చేయలేరా అంటూ స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయించినప్పటికీ అధికారుల అలసత్వంతో పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో ఆయన శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని మురుగునీరును శుద్ధి చేసే ఎస్టిపి ప్లాంట్ అంశంపై రోజులు గడుస్తున్న సమస్య కొలిక్కి రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంలో మున్సిపల్, రెవిన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపడం లేదని కాలయాపన చేయడం తప్పితే అడుగైన ముందుకు పడడం లేదని అసహనానికి గురయ్యారు. దాంతోపాటు సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ మున్సిపల్ పరిధిలో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని నిలదీశారు. అభివృద్ధిలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని సమయాన్ని వృధా చేయడం తప్పా ఏమాత్రం పనులు జరగడం లేదన్నారు. నెల రోజుల్లోపు అభివృద్ధి పనులన్ని ప్రారంభమయ్యేలా చూడాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిష్కార మార్గాల వెంటనే పూర్తి చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఇక కొన్ని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి పోలీసులు సహకరించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.ఈ సమీక్షలో ఆర్డీవో భవాని,తహసిల్దార్ ఇన్భనాధన్, కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, డి.ఎస్.పి డేగల ప్రభాకర్, గంగవరం రూరల్ సిఐ పరశురాముడు, టి.పి.ఎస్ ఇందిరా, మున్సిపల్ డిఈ మరియు ఏఈలు పాల్గొన్నారు…

మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మున్సిపల్ కమిషనర్ & అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి నూతనంగా జహీరాబాద్ మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని .రానున్న రంజాన్ పర్వదిన సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని ,ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద పరిశుభ్రత ,ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు , రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని , అదేవిదంగా పెండింగ్ టాక్స్ (బకాయిలను) వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జైతు రామ్,మున్సిపల్ అధికారులు , కౌన్సిలర్ లు తంజీమ్,గౌస్ గోరి,జాకీర్, జాహేద్ అలీ ,మహిపాల్ యాదవ్,దీపక్,మాజీ కౌన్సిలర్ లు నామ రవికిరణ్ , అబ్దుల్లా, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version