మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు మున్సిపల్ కమిషనర్ & అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి నూతనంగా జహీరాబాద్ మున్సిపాలిటీ లో విలీనమైన గ్రామాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని .రానున్న రంజాన్ పర్వదిన సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని ,ముఖ్యంగా ప్రార్థన మందిరాల వద్ద పరిశుభ్రత ,ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు , రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని , అదేవిదంగా పెండింగ్ టాక్స్ (బకాయిలను) వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జైతు రామ్,మున్సిపల్ అధికారులు , కౌన్సిలర్ లు తంజీమ్,గౌస్ గోరి,జాకీర్, జాహేద్ అలీ ,మహిపాల్ యాదవ్,దీపక్,మాజీ కౌన్సిలర్ లు నామ రవికిరణ్ , అబ్దుల్లా, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version