నేత్రదానం తో ఆదర్శంగా నిలిచిన ఎల్ఐసి ఏజెంట్ రౌతు రాజన్న
జైపూర్,నేటి ధాత్రి:
నేత్రదానం తో ఆదర్శంగా నిలిచిన ఎల్ఐసి ఏజెంట్ రౌతు రాజన్న జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రౌతు రాజన్న ఎల్ఐసి ఏజెంట్ గా వృత్తిలో భాగంగా మంచిర్యాల నుండి ఎన్టిపిసి వెళుతున్న క్రమంలో గోదావరిఖని జిఎం ఆఫీస్ హైవే రోడ్డుపై సోమవారం గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢీకొట్టడం వలన తలకు పెద్ద గాయం అయినట్లు స్థానికులు తెలిపారు.అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేపించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.రాజన్న పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు.కానీ తలకు పెద్ద గాయం అవ్వడం వల్ల మూడు రోజులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుని కుటుంబ సభ్యులు మనోధర్యంతో మరొక్కరి జీవితంలో వెలుగులు నింపాలని రాజన్న కళ్ళను దానం చేసి ఆదర్శంగా నిలిచారు.
