సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిధాత్రి ;

 

స్వతంత్రం భారతంలో వచ్చిన విప్లవాత్మక పన్ను సంస్కరణలు నిత్యావసరాలు ఆహార పదార్థాల పై పన్ను 18%,12% నుంచి 5% 0% తగ్గింపు తీసుకురావడం అనేది గొప్ప ఆశించదగ్గ విషయమని చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూవ్యవసాయ యంత్రాలు , స్ప్రే పార్ట్స్, ఎరువుల పై 18% 12% నుంచి 5% కి తగ్గింపు*ఆరోగ్య భీమా, జీవిత భీమా ప్రీమియం పై పన్ను 18% నుండి 0% కి తగ్గింపు*దేశ ప్రజలకు దసరా దీపావళి కానుకగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి*
ప్రధానమంత్రి మోదీ ఆగస్ట్ 15 న స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సూచనప్రాయంగా జి ఎస్ టి సంస్కరణల గురించి మాట్లాడటం జరిగింది. కానీ ప్రజలు ఊహించిన దానికంటే తొందరగా ఊహించిన దానికంటే గొప్పగా జి ఎస్ టి పన్ను తగ్గింపులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అని ,ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వతంత్ర భారతంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలబడుతుంది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు కూడా మధ్యతరగతి వేతన జీవులకు ఒక వరం లాంటిదనీ
ఈ పన్ను సంస్కరణల వల్ల వచ్చే 5-6 నెలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో కొంత కోత పడినా ఆ మొత్తం ప్రజలకు ఆదా అయి ఇతర అవసరాల కోసం వెచ్చించే అవకాశం ఉంటుందనీ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం తద్వారా దేశంలో తయారీ రంగాన్ని , వ్యవసాయ రంగాన్ని, నిర్మాణ రంగాలను బలపరిచే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ పన్ను సంస్కరణలు దేశ ఆర్ధిక వృద్ధికి దోహద పడతాయనడంలో సందేహం లేదనీ,ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీ గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు ,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ మార్తా అశోక్ పెరుమాండ్ల రాజు అనుప మహేష్ చింతల రాజేందర్ కేంసారపుప్రభాకర్ తీగల వంశీ సేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రం లో టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం..

కేసముద్రంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

ఆరోగ్య బీమా తీసుకోండి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందండి

తక్కువ ప్రీమియంతో… ఒకే పాలసీ తో కుటుంబ మొత్తానికి కవరేజ్ లభిస్తుంది

టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కే లక్ష్మణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ భవనం పైన గల మొదటి అంతస్తులో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆఫీస్ గణంగా ప్రారంభోత్సవం జరిగింది.
దీనికి ముఖ్య అతిధులుగా టాటా వరంగల్ బ్రాంచ్ మేనేజర్ కె. లక్ష్మణ్ సి బి ఏ జి . వీరేశం , కేసముద్రం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ,రావుల మురళి,అంబటి మహేందర్ రెడ్డి మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి చందా గోపి,బాలు నాయక్,సుధాకర్, జాఫర్, తుంపిల్ల వెంకన్న, వీరన్న, ఉపేందర్, టాటా ఎస్ బి ఏ, సత్యం , నగేష్ ,కొండల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్వవ అనంతరం టాటా లైఫ్ ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించే మేనేజర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవిత భీమా అనేది తప్పని సరిగా కల్పించాలనే సంకల్పం తో బుధవారం టాటా ఇన్సూరెన్స్ ఆఫీస్ ప్రారంభించటం జరిగినది. అలాగే సీనియర్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానర్ డాక్టర్ మోహన్ నాయక్, వనిత మాట్లాడుతూ కేసముద్రం మండల ప్రజలు, పట్టణ వాస్తవ్యులు అందరూ కూడా ఈ సర్వీసు పాయింట్ ను ఉపయోగించూకోగలరని
తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version