ప్రజల భూమూల సమస్యలు పరిష్కారంలో లైసెన్సడు సర్వేయర్ల పాత్ర కీలకము
కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిధాత్రి .
నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగాపారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు
మంగళవారం నాడు జజిల్సర్వే శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ తో కలిసి సర్వేయర్ లకు లైసెన్సులను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ భూ సర్వే వ్యవహారాలలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని అన్నారు ప్రజల భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్లు నిష్పాక్షికంగా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు భూ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వ రూల్స్ పాటిం చి పనిచేయాలని ఆదేశించారు
మండల స్థాయిలో సర్వేయర్లకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు భూ సర్వే ప్రక్రియల్లో ఎటువంటి అక్రమాలు నిర్లక్ష్యాలకు తావులేదని అలాంటివి చోటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లైసెన్స్డ్ సర్వేయర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భూ సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సూచించారు
ఈ సమావేశంలో సర్వే శాఖ ఏ డి శ్రీనివాస్, ఇతర సర్వే శాఖ అధికారులురెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు
