భూమి ఆక్రమణపై రైతుల ఆందోళన

మా అనుమతి లేకుండ భూమి ఆక్రమిస్తున్నారు
మేము అమృత్ పథకం కు భూమి ఇవ్వం
అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన
స్పందన కరువు
పంట ధ్వసం చేస్తే ఉరుకొం
మేము పేద రైతులం మాకు ఉంది ఇదే కొద్దీ భూమి
అధికారులను మమ్మల్ని బెదిరిస్తున్నారు
ప్రభుత్వం మాకు న్యాయం చెయ్యాలి

రాయికల్ ఏప్రిల్ 15 . నేటి ధాత్రి:

రాయికల్.పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో అమృత్ పథకం భూ భాదితులు కుర్మా మల్లారెడ్డి ,కుర్మ నారాయణ రెడ్డి ,కుర్మా ప్రేమ్ రెడ్డి ప్రెస్]మీట్ నిర్వహించారు ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతు ఐకెపి భవనం దగ్గర ఇరువై గుంటల ప్రభుత్వ భూమిని అమృత్ పథకం కు ట్యాంక్ నిర్మాణం కోసం మా అనుమతి లేకుండ నియంతృత్వంతో అధికారులు మా పంట భూమిని లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, మేము పూర్తీ ఇట్టి భూమిని ఆమోదించాము ఇచ్చే నష్టపరిహారం తీసుకుని రైతులు భూమిని మాకు అప్పజెప్పాలని రైతులం అయినా మాకె అల్టిమేటం ఇచ్చారని మాకు ఉన్నదే ఈ కొద్దీ భూమి ఇది ఆక్రమించుకుంటే మాబ్రతుకులు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేసారు,మాకు న్యాయం చెయ్యాలంటూ జిల్లా కలెక్టర్ ,జెసి కి ,ఎమ్మెల్యే ఎంపీ విజ్ఞప్తి చేసినప్పటికిని వారు చెప్తున్నా స్పందన లేదని పట్టణంలోని రెవెన్యూ సర్వే నెంబర్ లు [ 988/2/1/1/,] [988/2/1/2/1] [988/2/1/3/1] భూమిలో ఇప్పటి వరకే మేము గ్రామ అభివృద్ధి కోసం ఐకెపి భవనం కు ఇచ్చామని మా ద్రాతృత్వాన్ని గుర్తించి ప్రభుత్వ అధికారులు మాకు న్యాయం చేయవలసిందిగా పోయి అన్యాయంగా ఉన్న పంట భూమిని లాక్కువాలనుకోవడం సమంజసం కాదని తెలిపారు ఇకనైనా మా భూమిలో పెట్టిన ప్రతిపాదనను అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేసారు
మాజీ సర్పంచ్ తురగ రాజారెడ్డి మాట్లాడుతు బలవంతంగా నిరుపేద రైతులు భూమిని లాక్కోవాలని చూడడం సరికాదని అన్నారు గతంలో ప్రభుత్వ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు సహకారంతో రైతులమే భూములు దానమిచ్చి గ్రామ అభివృద్ధికి దోహద పడ్డామని,ఇలా బలవంతంగా భూమిని లాక్కోవడం ఎక్కడ చూడలేదని రైతుల సంబంధం లేని భూమిని సర్వే చేయడం గ్రామ సభ పెట్టి ఆమోదించడం నష్టపరిహారం తక్షణమే ఇస్తామనడం కుట్ర పూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు,అని వేరే చోట దాత భూమిని ఇచ్చేట సిద్ధంగా ఉన్నప్పటికిని ఇదే భూమి కావాలని అధికారులు పట్టు పట్టడం సరికాదని తక్షణమే ఈ పేద రైతుల భూమిలో పెట్టిన అమృత్ ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో రాము లింగ రెడ్డి ,జలపతి లక్ష్మారెడ్డి ,లింగా రెడ్డి ,వేణు ,గంగాధర్ ,సురేంధర్ పాల్గొన్నారు

బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్…

బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూ సేకరణ-మల్హార్రావు మండలం- తాడిచెర్ల గ్రామములో జెన్కో వారు భూ సేకరణ చేయవల్సిన డెంజర్ జోన్ పరిధిలోనికి వచ్చు తాడిచెర్ల క్యాస్టివ్ కోలెమైన్-1 కొరకు భూసేకరణ చేయు పరిధిలో నున్న భూములు, నివాస గృహాలు ఇతర నిర్మాణాలను రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో తప్పిపోయిన మా ఇల్లును సర్వే చేసి బాధించిన న్యాయం చేయాలి
సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన మల్హార్రావు మండలం తాడిచర్ల గ్రామస్తులు ఇటీవల కాలంలో తాడిచెర్ల గ్రామంలో జెన్కో అండ్ సింగరేణి భూ సర్వే చేయడం జరిగింది దానితో తాడిచెర్లో గ్రామాన్ని తరలించడం జరుగుతుంది కానీ కొంతమంది గ్రామస్తుల పేర్లు రెవెన్యూ శాఖ అధికారులు సర్వే లిస్టులో పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు గత15 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది అనంతరం స్పందించిన కలెక్టర్ తాడిచెర్ల గ్రామంలో రెవెన్యూ అధికారులు మళ్లీ భూ సర్వే చేసి గ్రామ సభ ద్వారా నిజమైన బాధితులను గుర్తించి అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. దీనితో బాధితులు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version