డీఫ్లోరైడ్ ప్రాజెక్టుతో పట్టణానికి మంచినీరు అందిస్తాం…

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుతో పట్టణానికి మంచినీరు అందిస్తాం

మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టు ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మంచినీటిని అందిస్తానని మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.
నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని డీఫ్లోరైడ్ ప్రాజెక్టును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా సందర్శించారు.ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ గతంలో అనేక సంవత్సరాలు నర్సంపేట పట్టణంతో పాటు వివిధ మండలాలకు నిత్యం త్రాగునీటిని అందించిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు, గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణానికి తాగునీటి సమస్య తీర్చాలన్న సంకల్పంతో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో డీఫ్లోరైడ్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించి ప్రాజెక్టును పునరుద్ధిస్తే నర్సంపేటకు తాగునీటి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రస్తావించి రూ.12కోట్ల నుండి 25 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని త్వరలోనే నిధులను మంజూరు తీసుకొచ్చి ప్రాజెక్టును పునరుద్దించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు.అందుకు ఉదాహరణ నేడు పబ్లిక్ హెల్త్ వాటర్ డిపార్ట్మెంట్, మిషన్ భగీరథ అధికారులతో డీఫ్లోరైడ్ ప్రాజెక్టును సందర్శించడం జరిగిందన్న విషయాన్ని గుర్తుకు చేశారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 24 X 7 తాగు నీటిని అందిస్తామని పేర్కొన్నారు..

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేందర్, మిషన్ భగీరథ డిఈ ఎస్డీ అజార్,మిషన్ భగీరథ డిటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్ రెడ్డి, ఏ ఈఈ వంశీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ నాధ్, అసిస్టెంట్ ఇంజనీర్ కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి, 5వ వార్డు పొన్నాల మనీషా-ప్రకాష్, 13వ వార్డు కౌన్సిలర్ భూక్య మాతృ రాథోడ్, 17వ వార్డు కౌన్సిలర్ సలవుదిన్ అయూబ్ ఖాన్, 22వ వార్డు కౌన్సిలర్ భాణాల ప్రసన్న-శ్రీనివాస్, 23వ వార్డు కౌన్సిలర్ వేల్పుల శ్రీలత, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, మాజీ వార్డు సభ్యులు గండి గిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు కొర్ర రాహుల్, భూక్య గణేష్, తదితరులు పాల్గొన్నారు.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా…

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరణ చేపట్టి ప్రజల తాగునీటి సమస్య తీరుస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్థానిక క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటీవలే డీఫ్లోరేడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావించడం ప్రాజెక్టును పునరుద్దించేందుకు కావాల్సిన నిధులు సుమారు రూ. 12 కోట్ల నుండి 25 కోట్ల వరకు నిధులు అవసరం కాగా నిధులు మంజూరు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అవి త్వరలోనే నిధులను మంజూరు చేయించి ప్రాజెక్టును పునరుద్దించి నర్సంపేట తాగునీటి సమస్య తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రాజెక్టు కేటాయించిన భూమి అక్రమానికి గురికాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.ప్రాజెక్ట్ నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు దూ సముద్రం చెరువు నుండి, అదే విధంగా ఎగువన ఫారెస్ట్ లో కురిసే వర్షపు నీటిని కాలువల ద్వారా నీటిని ప్రాజెక్టు చేర్చి నీటి సామర్థ్యం పెంచి నిత్యం నర్సంపేట ప్రజలకు నీరు అందించేందుకు త్వరలోనే చర్యలు చేపడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version