డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా…

డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్దించి తాగునీటి సమస్య తీరుస్తా

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న డీఫ్లోరైడ్ ప్రాజెక్టును పునరుద్ధరణ చేపట్టి ప్రజల తాగునీటి సమస్య తీరుస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్థానిక క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటీవలే డీఫ్లోరేడ్ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రస్తావించడం ప్రాజెక్టును పునరుద్దించేందుకు కావాల్సిన నిధులు సుమారు రూ. 12 కోట్ల నుండి 25 కోట్ల వరకు నిధులు అవసరం కాగా నిధులు మంజూరు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అవి త్వరలోనే నిధులను మంజూరు చేయించి ప్రాజెక్టును పునరుద్దించి నర్సంపేట తాగునీటి సమస్య తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రాజెక్టు కేటాయించిన భూమి అక్రమానికి గురికాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.ప్రాజెక్ట్ నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు దూ సముద్రం చెరువు నుండి, అదే విధంగా ఎగువన ఫారెస్ట్ లో కురిసే వర్షపు నీటిని కాలువల ద్వారా నీటిని ప్రాజెక్టు చేర్చి నీటి సామర్థ్యం పెంచి నిత్యం నర్సంపేట ప్రజలకు నీరు అందించేందుకు త్వరలోనే చర్యలు చేపడతానని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version