శ్రీధర్ బాబుకు పాలాభిషేకం చేసిన ఖమ్మంపల్లి ప్రజలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ శ్రీధర్ బాబు కి పాలభిషేకం చేసిన గ్రామ ప్రజలు,నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పర్శ ఓదెలు ఆధ్వర్యంలో ఖమ్మంపల్లి సమ్మక్క-సారక్క మినీ మేడారం అభివృద్ధి కొరకు నాలుగు లక్షలరూపాయలను ఇచ్చినందుకుగాను మన ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుచొప్పరి సదానందం కి పాలాభిషేకం చేయడం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు అల్లం కుమారస్వామి ,గ్రామ శాఖ అధ్యక్షులు పర్శ ఓదెలు,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాగరి సమ్మయ్య,గ్రామ యువజన అధ్యక్షులు వార్డుమెంబెర్స్ దొమ్మటి రాజేందర్,అల్లం శేఖర్ లు మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం దేవస్థానల అభివృద్ధికి నిధులు విడుదల చెయ్యడం
గొప్ప వరం లాంటిదని నాయకులు కొనియాడారు మరియు మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు కి టి పి సి సి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు కి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,రైతులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు….

లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండలం, ఖమ్మంపల్లి (సందరెల్లి) గ్రామంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మరియు నషాముక్త్ భారత్ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
మహిళల, బాలల హక్కులు: ఆడపిల్లల సంరక్షణ, లింగ నిర్ధారణ, అంటరానితనం, బాలల హక్కులు మరియు చట్టాలు, మహిళల హక్కులు గురించి వివరించారు.
* బేటీ బచావో బేటీ పఢావో: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు, ఇది ఆడపిల్లలను రక్షించడం, వారికి విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
* బాల్య వివాహాల నివారణ: బాల్య వివాహాలను నివారించడానికి తీసుకున్న చర్యలు మరియు చట్టాల గురించి తెలియజేశారు.
* సహాయక సేవలు: అంగన్‌వాడీ సేవలు, చైల్డ్ హెల్ప్‌లైన్ మరియు సఖి సేవలు, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన సహాయక సేవల గురించి కూడా వివరించారు.
* చట్టాలు, నేరాలు: పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన చట్టం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ మరియు అత్యవసర సమయాల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో శ్యామల (సోషల్ వర్కర్), శ్రావణ్ (అవుట్‌రీచ్ వర్కర్), నషముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల,సతీష్ (చైల్డ్ హెల్ప్‌లైన్ కౌన్సిలర్), హరీష్ (చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్), అంగన్‌వాడీ టీచర్ తిరుమల,ఆశా వర్కర్ సరిత, ఆసుపత్రి సిబ్బంది, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version