గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం…

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల మేడపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామ నూతన సర్పంచ్ కొల్లూరు అరుణ ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ మజహర్ అహ్మద్, గ్రామ కార్యదర్శి కాంచన రాథోడ్ నేతృత్వంలో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి అధికారుల సమన్వయంతో పనులను చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య, వీధి దీపాలు తదితర సమస్యలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా దశలవారీగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి లబ్దిదారులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు.పారిశుధ్య పనులపై గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బంటు శేఖర్, సిహెచ్ నిర్మలా లక్ష్మణ్, స్వప్న దిలీప్, రాములు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version