అందరికీ బీమా తో కుటుంబాలకు భరోసా..

అందరికీ బీమా తో కుటుంబాలకు భరోసా

ఇబ్రహీంపట్నం నేటిదాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అందరికీ భీమా మన గ్రామానికి ధీమా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆకస్మితంగా జరిగే ప్రమాదాల వలన కుటుంబం రోడ్డు పాలు అవుతుందని అందుకే ప్రధానమంత్రి భీమ యోజన మన గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ పథకం కుటుంబానికి ఎంతో అండగా ఉంటుందని సర్పంచ్ ఫోనుకంటి చిన్న వెంకటి మాట్లాడు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, జయ నర్సయ్య మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ బ్యాంకు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు,

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు…

వేసవి తాగునీటి కొరత: న్యాల్కల్ పంచాయతీ ముందస్తు చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ గ్రామపంచాయతీ రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మల్గి మెకానిక్ కిష్టన్నలతో కలిసి గ్రామంలోని మినీ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ట్యాంకుల పనితీరును తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ట్యాంకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, వేసవిలో గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. నీటిని వృథా చేయకుండా వినియోగించాలని గ్రామస్థులకు సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version