ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు…

ఘనంగా కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ 72వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్ని కేక్ కట్ చేసి,ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్స్ కి పండ్ల పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు

అదే విదంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు కౌన్సిలర్ జ్యోతుల మంజుల వేంకటేశ్వర్లు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క సంవత్సరం ఉచితంగా డిష్ కనెక్షన్ అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది న్యాయ సమర్థమైంది ధర్మమైనటువంటి కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమేనని, సబండ వర్గాలను ఏకతాటిపై తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా,నేడు ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మన అందరికి తెలుసు.

చాలా మంది నాయకులు వస్తుంటారు కానీ అందరికంటే భిన్నంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ ముఖ్యంగా మన ఇంట్లో ఆడపిల్లలు నీళ్ల కొరకు సుదూర ప్రాంతాలకు పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండకూడదు అని ప్రతి ఇంటిలో స్వచ్ఛమైనటువంటి గోదావరి, కృష్ణా జలాలు ఇవ్వాలనే సంకల్పంతోటి చేపట్టినటువంటి కార్యక్రమమే మిషన్ భగీరథ కార్యక్రమం.

నేడు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది

ఈరోజు మన రాష్ట్రానికి చెందిన వాళ్లే కాదు భారతదేశం నుంచి వచ్చిన అనేక మంది వ్యక్తులు ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉపాధి పొందుతూ స్థిరపడ్డారు.

హైదరాబాద్ నగరం ఈరోజు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలతో పోటీపడే స్థాయికి వచ్చింది.

అంతేకాదు ముఖ్యంగా రైతుల గురించి చాలా రాజకీయ పార్టీలు మాటలు చెప్పినయి కానీ ఎవరు కూడా చేయని విధంగా మొట్టమొదటిసారిగా రైతు నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ నాయకుడు విన్నవించకుండానే, ఆయనే ఒక్క రైతుగా అలోచించి ఎకరానికి పదివేల రూపాయల రైతుబంధు ఇచ్చి రైతుల పాలిట రైతు బాంధవుడయ్యాడు.
వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ ఇచ్చి పెద్దకొడుకు అయ్యాడు.
ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ రూ. 100016/-ఇచ్చి మేనమామ అయిండు. చరిత్రలో నిలిచిపోయే పరిపాలన చేసి ప్రజల మనస్సు గెలుచుకున్న కేసీఆర్ కి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆయన పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఆనందంగా జీవించాలని కోరుతూ వారికీ
భూపాలపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ప్రజల తరుపున శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version