పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని లోని పాత ఇస్సిపేట గ్రామం లో పలు కుటుంబాలను పరామర్శించిన తక్కళ్లపల్లి రాజు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేర్పాటి పోషమ్మ, నేర్పాటి లింగమ్మ, బొచ్చు సారయ్య ఇంటి వద్దకు వెళ్లి వారి చిత్ర పటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి రైస్ బ్యాగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తక్కళ్లపల్లి రాజు వెంట గ్రామ సర్పంచ్ పెనుకుల గట్టన్న, మూడో వార్డ్ మెంబర్ బొచ్చుఅర్చన(కిషన్), గ్రామ కాంగ్రస్ అధ్యక్షుడు నేర్పాటి జంపయ్య,సీనియర్ నాయకులు పెద్ద మొగిలి,మస్ అన్నపూర్ణ,కటిక అనిల్ ,పసరగొండ శ్రీను,బొచ్చు లడ్డు(తిరుపతి) తదితరులు పాల్గొన్నారు.
