
ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం.
ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం కల్వకుర్తి నేటి దాత్రి: కల్వకుర్తి పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఈనెల 30వ తేదీన వాహనాల వేలంపాట నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సిఐ వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎక్సైజ్ కేసులో పట్టుబడిన ఆటోలు, బైకులు వాహనాలను వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు వేలంపాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు డిపాజిట్ చేసి వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.