
డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ
డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోలీసుల ప్రత్యేక ర్యాలీ జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గురువారం ఉదయం డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయా కళాశాలల విద్యార్థులతో కలిసి పోలీసులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్ట్ న్యాయమూర్తి, డి. ఎస్. పి సైదా, ఆర్డీవో, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.