శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ…

శ్రీరామాంజనేయ ఆలయం భూమి పూజ

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

టేకుమట్ల మండల కేంద్రంలో నిర్మించబడనున్న శ్రీరామాంజనేయ ఆలయం ఆలయ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి హాజరై వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీర్తీ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు కేవలం ఆరాధన స్థలాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలయాలు కేంద్ర బిందువులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయం అని, త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్ర రెడ్డి మండల అధ్యక్షులు గుర్రపు నాగరాజు గౌడ్
మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా కోరసురేందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య సుబ్బక్కపల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ చాటకూల్ల తిరుపతి మేకల వీరారెడ్డి పంజాల కుమార్ శ్రీపతి శివ నూనెటి అరుణ్ కుమార్ బండపల్లి ఉపసర్పంచ్ ఆర్ అశోక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“మెదరమెట్లలో బీజేపీ ప్రచారం వేగం”

*మెదరమెట్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే బిజెపి బలపరిచిన చింతకింది మౌనిక సాయిరాం బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలానికి చెందిన మెదరమెట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతకింది మౌనిక సాయిరాం గారు ఇంటింటి ప్రచారం వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడానికి బీజేపీ అభ్యర్థి గెలుపు అత్యంత కీలకమని గ్రామస్తులకు వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పాల్గొని, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలతో మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంక్షేమ పథకాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామానికి కావాల్సిన రోడ్లు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, పేదలకు కల్పించే సేవలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు బీజేపీ అభ్యర్థి మౌనిక సాయిరాం గారు కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు అభ్యర్థికి మంచి స్పందన ఇస్తూ, అభివృద్ధి పరమైన మార్పుల కోసం బీజేపీకి తమ మద్దతు తెలుపుతున్నారు. బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ డాక్టర్ కీర్తి రెడ్డి గారు కోరారు.

 

కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి హరికృష్ణ,వీరన్న,మల్లారెడ్డి ప్రభాకర్,లింగమూర్తి.రాజయ్య నగేష్ సతీష్ ఓదెలు వెంకటేష్. సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version