దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదు కలెక్టర్ రాహుల్ శర్మ.

దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదు కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం
భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ 2025 ను సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో మహిళా శిశు దివ్యాన్గుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ నిధులు, పథకాల ద్వారా వారి ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని అన్నారు. మొట్ట మొదటి సారిగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. దివ్యాన్ గులల్లోని సృజనాత్మకత ను వెలికి తీయడానికి ఇదొక మంచి అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దివ్యాన్గుల పధకాలు ప్రతి మారుమూల గ్రామ స్థాయికి చేర్చాలని, దివ్యాన్గులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కపిస్తే వైకల్యం తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తారని తెలిపారు.
అధికారులు దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. దివ్యాన్గుల సంక్షేమం సంక్షేమ శాఖ బాధ్యతని, సంక్షేమం, సౌకర్యాలు కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాన్గులకు పాఠశాలల్లో విద్యాబ్యాసం, వృత్తి నైపుణ్యం, భవిత కేంద్రాలు నిర్వహణ, వారికి అవసరమైన పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. నేను మీకు అభయం ఇస్తున్నాను దివ్యాన్గులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమన్వయంతో అభివృద్ధి లో దివ్యాన్గులను భాగస్వాములను చేస్తూ చేయూతను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుద్ధిమాంద్యంతో బాధపడే దివ్యాంగుల సాధికారత కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చవల్ డిసేబులిటీఎస్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఎన్‌జీవోల స్టాళ్లు ఏర్పాటు చేయగా, వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. యూత్ ఫర్ జాబ్స్ సంస్థ ఉద్యోగ మేళా కోసం స్టాల్ ఏర్పాటు చేసింది. అలీం కో, ఐజినిష్డ్
సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అనంతరం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్టాళ్లు పరిశీలించి దివ్యాంగులతో ప్రత్యేకంగా ముఖాముఖీ మాట్లాడారు. అన్ని స్టాళ్లను సందర్శించి, దివ్యాన్గులు వేసిన పెయింటింగ్ కొనుగోలు చేసి నగదు చెల్లించి అభినందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులుప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
ఈ కార్యక్రమంలో 600 కంటే ఎక్కువ దివ్యాంగులు, 300 IERPs, ఎన్‌జీవోలు తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ డా. బి.వి. రామ్ కుమార్ దివ్యాంగులకు సౌకర్యాల కల్పన, అవసరమైన సేవల సమన్వయం కోసం ఆయన సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఈఓ రాజేందర్, వాసవి క్లబ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

పేదరికం నుండి పెద్ద చదువుల వరకు.!

పేదరికం నుండి పెద్ద చదువుల వరకు

అంగవైకల్యం అసలు అడ్డే కాదు

అంగవైకల్యాన్ని అధిగమించి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్న బొల్లారం సంజీవ్

 

 

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన బొల్లారం అగమ్మ లింగయ్య దంపతుల మూడవ సంతానం సంజీవ్, పుట్టుకతోనే శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ, జీవితంపై నమ్మకంతో,విద్యపై తపనతో తనను తాను తీర్చిదిద్దుకున్న ఉత్తమ ఉదాహరణ,ఆయన చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను,ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని,ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో దొమ్మటి రాజేందర్ మరియు స్నేహితులు ఆత్మస్థైర్యం అందించి ప్రోత్సహించారు.

 

ఎన్నో కష్టాలను ఎదుర్కొని విద్యాబ్యాసం

ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువుపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాడు.తల్లిని కోల్పోయిన సంజీవ్ ఆ బాధను దిగమింగుకుంటూనే విద్యను తన సాధనంగా మలుచుకున్నాడు.ఇటు చదువుకొనసాగిస్తూనే కీ
కొద్ది సంవత్సరాలు,వరంగల్ సెంట్రల్ జైలులో సైకాలాజి కౌన్సిలర్ గా కొద్దిరోజులు సేవాలందించారు.తనకు వచ్చిన చిన్న చిన్న పనులను చేసుకుంటూ ఒకరిమీద ఆధారపడకుండా తన జీవితాన్ని కొనసాగించాడు,క్రమంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ,పోరాట పంథాలోనే ప్రగతి సాధించాడు.

 

 

గవర్నర్ చేతులమీదుగా డాక్టరేట్

సూపర్వైజర్ ఆచార్య తక్కలపెల్లి.దయాకర్ రావు ఆధ్వర్యంలో పూర్తి చేసి ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న 23వ కన్వొకేషన్ సభలో,పిహెచ్డి(డాక్టరేట్) సోమవారం రోజున రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయమే కాదు ఇది సమాజానికి ఒక స్పష్టమైన సందేశం “అంగవైకల్యం శరీరానికి మాత్రమే.మనసు,విజ్ఞానం, కలలకి కాదు”అనే వాక్యం సంజీవ్ జీవితంలో పటిష్ఠంగా నిలిచింది.కుటుంబ పరిస్థితులు,శారీరక సమస్యలు,పర్యావరణ అడ్డంకులు అన్నిటినీ దాటి తన స్థానం సంపాదించుకున్న ఆయన అంగవైకల్యం ఉన్న విద్యార్థులకే కాదు,ప్రతీ సామాన్య యువకునికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

 

 

 

సంజీవ్ విద్యతోపాటు సామాజిక స్పృహతో కూడిన వ్యక్తిగా, ఇతర దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తూ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.ఈ క్షణం,అయన జీవితంలోని ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ సందర్భంగా సంజీవ్ ని సత్కరించి,ఆయన విజయాన్ని గర్వంగా గుర్తించాల్సిన అవసరం సమాజంపై ఉంది.ఆయన జీవిత ప్రయాణం పరిమితి ఉన్న శరీరం,అపరిమితమైన ఆశయాల మధ్య జరిగే ఓ గొప్ప పోరాటమని చెప్పవచ్చు.

 

 

ఈ కార్యంతో మాగ్రామానికి యువతకు ఆదర్శప్రాయంగా ఉంటాడు-కాలనీ వాసులు

బొల్లారం సంజీవ గవర్నర్ చేతులమీదుగా పిహెచ్డి అందుకోవడం చాలా గర్వంగా ఉంది.మేము చిన్నత్తనంనుండి సంజీవ ను చూస్తువస్తున్నాం పేదరికంలో పుట్టి పెరిగి అంగవైకల్యం ఉన్నప్పటికీ అనేక కష్టాలు పడి పేదరికంతో పోరాడి కస్టపడి చదివి ఈ స్థాయికీ చేరుకోవడం మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందకరంగా ఉన్నదని మా గ్రామం తరుపున మా కాలనీ తరుపున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version