కంప్యూటర్ సైన్స్ విభాగంలో పరిశోధనకు శ్రవణ కుమారికి డాక్టరేట్
నేటిధాత్రి:
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (ఆటనామస్) కంప్యూటర్ సైన్స్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న కుడికాల శ్రవణ కుమారికి కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.బి. మంజుల గారి పర్యవేక్షణలో పరిశోధన గ్రంధం సమర్పించిందుకు గాను కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ట రాజేందర్ డాక్టరేట్ ప్రకటించారు. డాక్టరేట్ సాధించిన వీరిని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హన్మకొండ ప్రిన్సిపాల్ కె. రజనీలత మరియు అధ్యాపకులు అభినందించారు. తన పిహెడి పరిశోధన సాధనలో ఎల్ల వేళల సహాయ సహకారం అందించిన సూపర్వైజర్, అధ్యాపక బృందానికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.