వార్‌ 2 హక్కులు ఆ సంస్థకే.

వార్‌ 2 హక్కులు ఆ సంస్థకే

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ…

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బేనర్‌పై తెలుగు రాష్ట్రాల్లో ‘వార్‌-2’ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన తారక్‌ సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నటించిన రెండు సినిమాలు ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘దేవర’ మా బేనర్‌పై విడుదలయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్‌-2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందాం’ అంటూ నిర్మాత నాగవంశీ ఓ వీడియోను షేర్‌ చేశారు. ’వార్‌-2’ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

సబ్ స్టేషన్ తండా వాస్తవ్యులు మలోత్ రాజు ఇటీవల జరిగిన
పాకిస్తాన్ మరియు ఇండియ సిందూరు ఆపరేషన్ యుద్ధంలో
కేసముద్రం మున్సిపాలిటీ పరిది లోని సబ్ స్టేషన్ తండా కూ చెందిన మలోత్ రాజు పాల్గొనడం గర్వకారణమని, అగ్రోస్ రైతు సేవ కేంద్రం దన్నసరి క్రాస్ రోఢ్ యజమానులు ధారావత్ రాజు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ కేసముద్రం మండల అధ్యక్షులు ననబల రమేష్ ఏఎంసి కేసముద్రం మాజీ డైరెక్టర్ ధారావత్ రమారవిందర్ నాయక్,
బనోత్ నాగ ,మాలోత్ బాలాజీ, బానోత్ రాజు, బనోత్ సురేష్, బానోత్ వీరన్న తదితరులు పాల్గోన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version