ఎన్నికల నియమాలను పాటించకుంటే చర్యలు తప్పవు…

ఎన్నికల నియమాలను పాటించకుంటే చర్యలు తప్పవు

నర్సంపేట టౌన్ ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించకుంటే చర్యలు తప్పవని నర్సంపేట టౌన్ ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇతర పార్టీలను గాని, వ్యక్తులను గాని కించపరిచే వాఖ్యలు చేయకూడదని అన్నారు.ఓట్ల కోసం డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ చేయడం ఎన్నికల చట్టాల ప్రకారం తీవ్రమైన నేరమని నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల శాంతిభద్రతలకు, ఎన్నికల నిర్వహణకు భంగం కలిగించే ఏ ప్రయత్నమైనా చట్టప్రకారం కఠినంగా వ్యవహరించబడుతుందని తెలిపారు.ఏదైనా బెల్ట్ షాపులు నడిపినా,మాదకద్రవ్యాలు వినియోగించిన,అమ్మినా,అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version