ప్రజల్లో ఉండే నేత నవీన్ యాదవ్…

ప్రజల్లో ఉండే నేత నవీన్ యాదవ్

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విద్యావంతుడు స్థానికుడు నిత్యం ప్రజల్లో ఉండే నేతగా పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారని పేద ప్రజలకు చిన్న శ్రీశైలం యాదవ్ సాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు. తండ్రి బాటలో నడుస్తున్న నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్ద ఎత్తున చేపడుతున్నారని రాజేందరావు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన ఇంటలెక్చువల్ విద్యావంతులు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వారితోను రాజేందర్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version