నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి..

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి

◆”-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారి ఆదేశాలతో

◆”-: లబ్దిదారులకు ₹ 18,35,500 /- సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని, నిరుపేదలు అనారోగ్యానికి గురై తన సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం ఖర్చు అయిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తుందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా:చంద్రశేఖర్ తెలిపారు.నియోజకవర్గంలోని జహీరాబాద్,న్యాలకల్, కోహిర్, ఝారసంఘం, మొగుడంపల్లి,మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సూచన మేరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అద్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు వీరా రెడ్డి, రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,సత్వర్ పిఎసిఎస్ ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పేపల్లి మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,శేఖర్ ,విష్ణు , ఫైజ్, తదితరులు అందజేశారు..సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డా:చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version